బాపట్ల జిల్లా వేమూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అనిల్ కుమార్.. మైనార్టీ యువకుడిని స్టేషన్కు పిలిపించి దాడి చేసిన ఘటనపై మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి స్పందించింది. ఎస్ఐ దాడిలో గాయపడి.. గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమ్మద్ రఫీని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఫారుక్ షిబ్లీ పరామర్శించారు.
ఒకవేళ రఫీ తప్పు చేసి ఉంటే రాజ్యాంగపరంగా శిక్షించాలే తప్ప.. రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని శిక్షించే అర్హత ఎస్ఐకి లేదని ఫారుక్ షిబ్లీ అన్నారు. ఘటనకు కారణమైన ఎస్ఐ అనిల్ కుమార్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై దర్యాప్తు జరిపించి.. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ తప్పు చేసినట్లు రుజువైతే అతనిపై కేసు నమోదు చేయాలన్నారు. లేకుంటే తమ సంఘం తరఫున న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.