ETV Bharat / state

రూరల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ శ్యామలాదేవిపై బదిలీ వేటు..

author img

By

Published : Dec 27, 2022, 8:41 AM IST

ఈనాడు-ఈటీవీ వరుస కథనాలతో రాయచోటిలో ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై జిల్లా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ప్రకంపనలు సృష్టించిన ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై ఉన్నతాధికారులు కొరఢా ఝులిపించారు. 120 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇక రికార్డుల పరంగా 13 ఎకరాలు యథాతథంగా ప్రభుత్వ భూమిగానే కొనసాగనుందని అధికారులు వెల్లడించారు.

భూమి
LAND

YCP Leaders Occupying Government Land In Annamaiya District: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ప్రకంపనలు సృష్టించిన ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై ఉన్నతాధికారులు కొరఢా ఝులిపించారు. 120 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 13 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ ను తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. కడప గ్రామీణ సబ్ రిజిస్ట్రార్ శ్యామలాదేవిని బదిలీ చేశారు. రికార్డులు ట్యాంపర్ చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది.

120 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అప్పనంగా రిజిస్ట్రేషన్

ఈనాడు-ఈటీవీ వరుస కథనాలతో రాయచోటిలో ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై జిల్లా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. వైసీపీ నాయకులకు అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ శ్యామలాదేవిని బదిలీ చేశారు. కడప అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కార్యాలయానికి ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆమె స్థానంలో కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్​గా సుందరేశానికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించగా ఆయన విధుల్లో చేరారు. రాయచోటిలోని సర్వేనంబరు 971/1లో ఉన్న 13 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు గజేంద్రరెడ్డి, హరినాథ్ రెడ్డి, జింకా రమేష్, యూసఫ్ కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నవంబరు 9న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 120 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అప్పనంగా రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన ఆరుగురు వైసీపీ నాయకులు, సబ్ రిజిస్ట్రార్ శ్యామలాదేవిపై ఇప్పటికే రాయచోటి పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కేసుకు సంబంధించి సోమవారం రాయచోటి పోలీసులు కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి విచారణ చేసి వెళ్లారు. రిజిస్ట్రేషన్ జరిగిన రికార్డులను పరిశీలించారు.

ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై జిల్లా రిజిస్ట్రార్ అండ్ స్టాంప్స్ అధికారులు విచారణ చేపట్టారు. రాయచోటిలోని 13 ఎకరాల ప్రభుత్వ భూమికి జరిగిన రిజిస్ట్రేషన్ ను తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. రాయచోటి సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను తిరస్కరిస్తూ కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తిప్పి పంపారు. ఇక కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కూడా 13 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ను తిరస్కరిస్తున్నట్లు అధికారికంగా రెఫ్యూజల్ ఆర్డర్ ఇచ్చారు. ఇక రికార్డుల పరంగా 13 ఎకరాలు యథాతథంగా ప్రభుత్వ భూమిగానే కొనసాగనుందని అధికారులు వెల్లడించారు.

కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ శ్యామలాదేవి రికార్డులు ట్యాంపర్ చేసి లేని భూమి ఉన్నట్లుగా చూపించి అక్రమంగా 13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు, ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. రాయచోటి, మాసాపేటలో వేర్వేరు సర్వే నంబర్లలో భూమి ఉన్నప్పటికీ మొత్తం 971 సర్వేనంబరు కింద చూపి 13 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది.

ఇవీ చదవండి

YCP Leaders Occupying Government Land In Annamaiya District: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ప్రకంపనలు సృష్టించిన ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై ఉన్నతాధికారులు కొరఢా ఝులిపించారు. 120 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 13 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ ను తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. కడప గ్రామీణ సబ్ రిజిస్ట్రార్ శ్యామలాదేవిని బదిలీ చేశారు. రికార్డులు ట్యాంపర్ చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది.

120 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అప్పనంగా రిజిస్ట్రేషన్

ఈనాడు-ఈటీవీ వరుస కథనాలతో రాయచోటిలో ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై జిల్లా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. వైసీపీ నాయకులకు అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ శ్యామలాదేవిని బదిలీ చేశారు. కడప అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కార్యాలయానికి ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆమె స్థానంలో కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్​గా సుందరేశానికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించగా ఆయన విధుల్లో చేరారు. రాయచోటిలోని సర్వేనంబరు 971/1లో ఉన్న 13 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు గజేంద్రరెడ్డి, హరినాథ్ రెడ్డి, జింకా రమేష్, యూసఫ్ కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నవంబరు 9న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 120 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని అప్పనంగా రిజిస్ట్రేషన్ చేసేసుకున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన ఆరుగురు వైసీపీ నాయకులు, సబ్ రిజిస్ట్రార్ శ్యామలాదేవిపై ఇప్పటికే రాయచోటి పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కేసుకు సంబంధించి సోమవారం రాయచోటి పోలీసులు కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి విచారణ చేసి వెళ్లారు. రిజిస్ట్రేషన్ జరిగిన రికార్డులను పరిశీలించారు.

ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ పై జిల్లా రిజిస్ట్రార్ అండ్ స్టాంప్స్ అధికారులు విచారణ చేపట్టారు. రాయచోటిలోని 13 ఎకరాల ప్రభుత్వ భూమికి జరిగిన రిజిస్ట్రేషన్ ను తిరస్కరిస్తూ ఆదేశాలు ఇచ్చారు. రాయచోటి సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను తిరస్కరిస్తూ కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తిప్పి పంపారు. ఇక కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కూడా 13 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ ను తిరస్కరిస్తున్నట్లు అధికారికంగా రెఫ్యూజల్ ఆర్డర్ ఇచ్చారు. ఇక రికార్డుల పరంగా 13 ఎకరాలు యథాతథంగా ప్రభుత్వ భూమిగానే కొనసాగనుందని అధికారులు వెల్లడించారు.

కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ శ్యామలాదేవి రికార్డులు ట్యాంపర్ చేసి లేని భూమి ఉన్నట్లుగా చూపించి అక్రమంగా 13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినట్లు పోలీసులు, ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. రాయచోటి, మాసాపేటలో వేర్వేరు సర్వే నంబర్లలో భూమి ఉన్నప్పటికీ మొత్తం 971 సర్వేనంబరు కింద చూపి 13 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.