ETV Bharat / state

మద్యపానం నిషేధించాలంటూ మహిళల ధర్నా - womens protest in ap

పేదల కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న మద్యాన్ని వెంటనే నిషేధించాలంటూ.. తెలుగుదేశం మహిళా నేతలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంరలో ధర్నా చేశారు.

ananthapuram district
మద్యపానం నిషేధించాలని మహిళల ధర్నా..
author img

By

Published : May 14, 2020, 11:23 AM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంరలో మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా తెలుగు మహిళలు నిరసన చేపట్టారు. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేసి భౌతిక దూరం పాటిస్తూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు.

కరోనా నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఓ చేత్తో పేదలకు డబ్బు ఇస్తూ.. మరో చేత్తో మద్యం పేరున దోపిడీ చేస్తుంటే ప్రభుత్వంలోని మహిళా నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం పెంచిన విద్యుత్ బిల్లు, నిత్యావసరాల ధరలను తగ్గించాలన్నారు. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంరలో మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా తెలుగు మహిళలు నిరసన చేపట్టారు. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేసి భౌతిక దూరం పాటిస్తూ ధర్నా చేపట్టారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు.

కరోనా నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఓ చేత్తో పేదలకు డబ్బు ఇస్తూ.. మరో చేత్తో మద్యం పేరున దోపిడీ చేస్తుంటే ప్రభుత్వంలోని మహిళా నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం పెంచిన విద్యుత్ బిల్లు, నిత్యావసరాల ధరలను తగ్గించాలన్నారు. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'కాలుష్యంతో ఛస్తున్నాం.. ఆ పరిశ్రమను తరలించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.