అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు గ్రామంలో ఈ నెల 13న జరిగిన తెదేపా, వైకాపా నాయకుల మధ్య ఘర్షణ కేసులో ఇరువర్గాలకు చెందిన 21 మందిపై కేసులు నమోదు చేసి 19 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. వారిని రిమాండ్కు తరలించామన్నారు. తెదేపాకు చెందిన తిరుపాల్ రెడ్డితో పాటూ మరో 12 మందిపై, వైకాపాకు చెందిన రాజగోపాల్ రెడ్డితో పాటూ మరో 8 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. వీరిలో వైకాపాకు చెందిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వివరించారు.
ఇదీ చదవండి: పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమావేశం