ETV Bharat / state

ఘర్షణ కేసులో తెదేపా, వైకాపా నాయకుల అరెస్ట్

పంచాయతీ ఎన్నికల్లో తెదేపా-వైకాపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి పోలీసులు 21 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో 19 మందిని రిమాండ్​కు తరలించినట్లు డీఎస్పీ చైతన్య చెప్పారు.

author img

By

Published : Feb 16, 2021, 4:48 PM IST

dsp
ఘర్షణ కేసులో తెదేపా, వైకాపా నాయకుల అరెస్ట్

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు గ్రామంలో ఈ నెల 13న జరిగిన తెదేపా, వైకాపా నాయకుల మధ్య ఘర్షణ కేసులో ఇరువర్గాలకు చెందిన 21 మందిపై కేసులు నమోదు చేసి 19 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. వారిని రిమాండ్​కు తరలించామన్నారు. తెదేపాకు చెందిన తిరుపాల్ రెడ్డితో పాటూ మరో 12 మందిపై, వైకాపాకు చెందిన రాజగోపాల్ రెడ్డితో పాటూ మరో 8 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. వీరిలో వైకాపాకు చెందిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వివరించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు గ్రామంలో ఈ నెల 13న జరిగిన తెదేపా, వైకాపా నాయకుల మధ్య ఘర్షణ కేసులో ఇరువర్గాలకు చెందిన 21 మందిపై కేసులు నమోదు చేసి 19 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. వారిని రిమాండ్​కు తరలించామన్నారు. తెదేపాకు చెందిన తిరుపాల్ రెడ్డితో పాటూ మరో 12 మందిపై, వైకాపాకు చెందిన రాజగోపాల్ రెడ్డితో పాటూ మరో 8 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. వీరిలో వైకాపాకు చెందిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వివరించారు.

ఇదీ చదవండి: పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.