ETV Bharat / state

సభలో వైకాపా సభ్యుల తీరు అనైతికం: కాలవ శ్రీనివాసులు

తెదేపా పూర్వవైభవానికి నేతలు, కార్యకర్తలు కృషిచేయాలని ఆ పార్టీ నేత కాలవ శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గంలో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శాసనసభలో మంత్రులు, వైకాపా సభ్యులు వ్యవహిస్తున్న తీరు అప్రజాస్వామ్యంగా ఉందని మండిపడ్డారు.

author img

By

Published : Jul 19, 2019, 3:42 AM IST

సభలో వైకాపా సభ్యుల తీరు అనైతికం : కాలవ శ్రీనివాసులు
సభలో వైకాపా సభ్యుల తీరు అనైతికం : కాలవ శ్రీనివాసులు

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గురువారం ఆయన అధ్యక్షతన నియోజకవర్గ తెదేపా నేతల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రోజురోజుకీ వైకాపా నాయకుల ప్రవర్తన... ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని కాలవ అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల సభలో సీఎం జగన్​ వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామ్యంగా ఉందన్నారు. తన తండ్రి వయసు కలిగిన చంద్రబాబు పట్ల ఎలాంటి గౌరవమర్యాదలు లేకుండా మంత్రులతో చేయిస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు.

'కొత్తగా అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేయాలి. సీఎం జగన్ ప్రజల మంచి కోసం చేపట్టే ఏ కార్యక్రమానికైనా తెదేపా సహకరిస్తుంది. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఊరుకోం.' - కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి

వైకాపా నాయకులు తెదేపా నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని కాలవ చెప్పారు. కార్యకర్తలను కాపాడుకోడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించేందుకు తెదేపా నేతలు కృషిచేయాలన్నారు. త్వరలో వచ్చే గ్రామ సర్పంచ్​, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి నేతలందరు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోంది: కన్నా

సభలో వైకాపా సభ్యుల తీరు అనైతికం : కాలవ శ్రీనివాసులు

తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గురువారం ఆయన అధ్యక్షతన నియోజకవర్గ తెదేపా నేతల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రోజురోజుకీ వైకాపా నాయకుల ప్రవర్తన... ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని కాలవ అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల సభలో సీఎం జగన్​ వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామ్యంగా ఉందన్నారు. తన తండ్రి వయసు కలిగిన చంద్రబాబు పట్ల ఎలాంటి గౌరవమర్యాదలు లేకుండా మంత్రులతో చేయిస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు.

'కొత్తగా అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేయాలి. సీఎం జగన్ ప్రజల మంచి కోసం చేపట్టే ఏ కార్యక్రమానికైనా తెదేపా సహకరిస్తుంది. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఊరుకోం.' - కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి

వైకాపా నాయకులు తెదేపా నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని కాలవ చెప్పారు. కార్యకర్తలను కాపాడుకోడానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించేందుకు తెదేపా నేతలు కృషిచేయాలన్నారు. త్వరలో వచ్చే గ్రామ సర్పంచ్​, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి నేతలందరు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు.

ఇదీ చదవండి : రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోంది: కన్నా

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్... గత ప్రభుత్వం హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లు శిథిలావస్థకు చేరుకొన్నాయి. ఈ నెల 31 నుంచి అన్నా క్యాంటీన్ల్ పూర్తిగా మూతపడుతున్నాయని అందులో పనిచేసే కార్మికుల ఆందోళన బాట పట్టారు.

చాలిచాలని వేతనాలు తీసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నామని .. ఉపాధి కల్పించే అన్న క్యాంటీన్లు మూత పడితే మా పరిస్థితి ఏంటి అని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.

ఒకవైపు అన్నా క్యాంటీన్లు ఈ నెల 11 న మూసివేస్తారు అని చెప్పి మరల ఈ నెల 31 వరకు కొనసాగిస్తున్నామని చెప్పి నడుపుతున్నారని ఈ నెలాఖరుకు క్యాంటీన్లు మూసివేస్తే తమ జీవనం అంధకారం మారిపోతుందని రాష్ట్ర వ్యాప్తంగా 20 వేలు పైగా కార్మికులు ఉన్నారని వారు అందరూ రోడ్డున పడతారని తెలిపారు.

గత 4 నెలలు నుండి అన్నా క్యాంటీన్లు లో పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని 31 న క్యాంటీన్లు మూసివేస్తే మా పరిస్థితి ఏంటి... మా వేతనాలు ఎవరు చెల్లిస్తారు అంటూ కార్మికులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం మారితే తమకు ఎదో మేలు చేకూరుతుందని జగన్ కు ఓటు వేస్తే నోటికాడి కుడు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని అన్నా క్యాంటీన్లు యధావిధిగా కొనసాగించి తమకు ఉపాధి కల్పించాలని కార్మికుల డిమాండ్ చేశారు. అసలు అన్నా క్యాంటీన్లు నడుపుతారా లేక మూసివేస్తారా తమ జీతాలు చెలిస్తారా లేదా అనేది సృష్టమైన హామీ ఇవ్వాలని కోరారు.

అన్నా క్యాంటీన్లు పై సరైన సృష్టత రాకముందే చంద్రన్నా క్యాంటీన్లు కాస్తా రాజన్న క్యాంటీన్లు గా దర్సనిమిస్తున్నాయి. గతంలో ఉన్న రంగులు బోర్డులు తొలగించి రాజన్న క్యాంటీన్లు గా కొత్త రూపంతో దర్శనమిస్తున్నాయి ప్రస్తుత క్యాంటీన్లు. విచ్చలవిడిగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పేర్లు మార్చుకుంటూ తమకు ఇష్టమైన నాయకుడు చిత్రపటాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై వివరణ అడిగితే అధికార పార్టీ నేతలు పేర్లు మార్చి ఫ్లెక్సీలు పెట్టారు మాకు తెలియదని నిర్వహుకులు చేతులు దులుపుకొన్నారు.


Body:బైట్.....నసర్ బీ

బైట్....లక్ష్మీ

బైట్...రవి శంకర్

బైట్...నత్రేయులు

బైట్.....దుర్గ

బైట్...నిర్మలమ్మ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.