ETV Bharat / state

'ప్లాన్‌కు విరుద్ధంగా ఎలా నిర్మిస్తారు' - తిరుమల శారదాపీఠం భవనంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు - AP HIGH COURT ON SARADA PEETHAM

అనుమతి లేకుండా నిర్మిస్తే ఏం జరుగుతుందో ఈ కేసు ఉదాహరణ కావాలన్న హైకోర్టు - కౌంటర్ దాఖలు చేయాలని శారదా పీఠానికి హైకోర్టు ఆదేశాలు

AP High Court Comments On Sarada Peetham Building in Tirumala
AP High Court Comments On Sarada Peetham Building in Tirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2025, 8:45 PM IST

Updated : Jan 22, 2025, 10:34 PM IST

AP High Court Comments on Sarada Peetham Building in Tirumala: తిరుమలలోని శారదాపీఠం భవన నిర్మాణం విషయంలో ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించడానికి వీల్లేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ భవనం నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది. 'ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారు?' అని ధర్మాసనం ప్రశ్నించింది. అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరిపితే ఏం జరుగుతుందో ఈ కేసు ఒక ఉదాహరణ కావాలని హైకోర్టు పేర్కొంది.

తిరుమలలో అక్రమ నిర్మాణాలు : విశాఖ శారదాపీఠం తిరుమలలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నప్పటికీ టీటీడీ దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు, న్యాయవాది తుమ్మా ఓంకార్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. గతంలోనే ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఈ పిల్‌పై మరోసారి విచారణ జరిగింది. శారదాపీఠం భవనాన్ని సీజ్‌ చేస్తూ టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

కూల్చివేతకు ఆదేశాలిస్తాం : అయితే బిల్డింగ్‌ ప్లాన్‌ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేస్తారని? హైకోర్టు ప్రశ్నించింది. నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలిస్తామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అనంతరం కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని శారదాపీఠం తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అందుకు అనుమతిస్తూ తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

తిరుపతి తొక్కిసలాట ఘటన - న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశం

గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు: తిరుమలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ అండ దండలతో విశాఖ శారదాపీఠం భూకబ్జాకు పాల్పడిందని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్‍ ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా శారదాపీఠం అక్రమ నిర్మాణాలను గత టీటీడీ ధర్మకర్తల మండలి క్రమబద్దీకరించిందని విమర్శించారు. కబ్జా చేసిన ప్రాంతంలో అక్రమంగా నిర్మాణాలు చేశారని గతంలో ఈవో ధర్మారెడ్డికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశానన్నారు.

అక్రమ కట్టడాలను వెంటనే నిలుపుదల చేయాలని గత ప్రభుత్వ హయంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాతకట్టడాల మీద హైకోర్టును ఆశ్రయించానన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి మొదటి సమావేశంలో చైర్మన్‍ బీఆర్‍ నాయుడు అధ్యక్షతన విశాఖ శారదా పీఠం అక్రమకట్టడాలను ఊపేక్షించేది లేదని స్ధలాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

శారదా పీఠానికి మరో షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

తిరుమలలో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు - చర్యలకు టీటీడీని ఆదేశించిన ప్రభుత్వం

AP High Court Comments on Sarada Peetham Building in Tirumala: తిరుమలలోని శారదాపీఠం భవన నిర్మాణం విషయంలో ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించడానికి వీల్లేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ భవనం నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది. 'ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారు?' అని ధర్మాసనం ప్రశ్నించింది. అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరిపితే ఏం జరుగుతుందో ఈ కేసు ఒక ఉదాహరణ కావాలని హైకోర్టు పేర్కొంది.

తిరుమలలో అక్రమ నిర్మాణాలు : విశాఖ శారదాపీఠం తిరుమలలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నప్పటికీ టీటీడీ దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు, న్యాయవాది తుమ్మా ఓంకార్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. గతంలోనే ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఈ పిల్‌పై మరోసారి విచారణ జరిగింది. శారదాపీఠం భవనాన్ని సీజ్‌ చేస్తూ టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

కూల్చివేతకు ఆదేశాలిస్తాం : అయితే బిల్డింగ్‌ ప్లాన్‌ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేస్తారని? హైకోర్టు ప్రశ్నించింది. నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలిస్తామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అనంతరం కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని శారదాపీఠం తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అందుకు అనుమతిస్తూ తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

తిరుపతి తొక్కిసలాట ఘటన - న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశం

గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు: తిరుమలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ అండ దండలతో విశాఖ శారదాపీఠం భూకబ్జాకు పాల్పడిందని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్‍ ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా శారదాపీఠం అక్రమ నిర్మాణాలను గత టీటీడీ ధర్మకర్తల మండలి క్రమబద్దీకరించిందని విమర్శించారు. కబ్జా చేసిన ప్రాంతంలో అక్రమంగా నిర్మాణాలు చేశారని గతంలో ఈవో ధర్మారెడ్డికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశానన్నారు.

అక్రమ కట్టడాలను వెంటనే నిలుపుదల చేయాలని గత ప్రభుత్వ హయంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాతకట్టడాల మీద హైకోర్టును ఆశ్రయించానన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి మొదటి సమావేశంలో చైర్మన్‍ బీఆర్‍ నాయుడు అధ్యక్షతన విశాఖ శారదా పీఠం అక్రమకట్టడాలను ఊపేక్షించేది లేదని స్ధలాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

శారదా పీఠానికి మరో షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

తిరుమలలో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు - చర్యలకు టీటీడీని ఆదేశించిన ప్రభుత్వం

Last Updated : Jan 22, 2025, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.