ETV Bharat / state

బడికి వెళ్లాలని తల్లి చెప్పినందుకు... కొడుకు బలవన్మరణం!

కొద్ది సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. అయినా... అధైర్యపడకుండా తనకున్న నలుగురు పిల్లలే సర్వస్వంగా కుటుంబాన్ని వెళ్లదీస్తోంది ఆ మహిళ. పిల్లల పైనే ఆశలు పెట్టుకొని కూలీ పనులు చేస్తూ.. చదివిస్తోంది. తన కుమారుడు బడికి వెళ్లనని మెుండికేయగా.. కోపంలో మందలించింది. అంతే.. క్షణికావేశానికి గురైన ఆ చిన్నారి... ఆ తల్లికి కడుపుకోతను మిగుల్చుతూ... ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

author img

By

Published : Aug 19, 2019, 11:12 PM IST

బలవన్మరణం
బలవన్మరణం

అనంతపురం జిల్లా గుంతకల్లు రాయల్ కూడలిలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేనభీ అనే మహిళకు నలుగురు సంతానం. కొద్ది సంవత్సరాల క్రితం భర్త చనిపోగా... కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. సమీపంలోని మునిసిపల్ పాఠశాలలో 10వ తరగతి చదవుతున్న ఆమె కుమారుడు దాదా ఖలందర్.. కొంత కాలంగా పాఠశాలకు వెళ్లనని మెుండికేస్తున్నాడు. విసిగిపోయిన తల్లి అతడిని ఈ మధ్య తీవ్రంగా మందలించింది. మనస్థాపం చెందిన సదరు విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతికందిన కొడుకు కుటుంబానికి అండగా ఉంటాడని ఆశలు పెట్టుకున్న ఆ తల్లికి.. కుమారుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం తీరని విషాదాన్ని మిగిల్చింది.

బలవన్మరణం

అనంతపురం జిల్లా గుంతకల్లు రాయల్ కూడలిలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేనభీ అనే మహిళకు నలుగురు సంతానం. కొద్ది సంవత్సరాల క్రితం భర్త చనిపోగా... కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. సమీపంలోని మునిసిపల్ పాఠశాలలో 10వ తరగతి చదవుతున్న ఆమె కుమారుడు దాదా ఖలందర్.. కొంత కాలంగా పాఠశాలకు వెళ్లనని మెుండికేస్తున్నాడు. విసిగిపోయిన తల్లి అతడిని ఈ మధ్య తీవ్రంగా మందలించింది. మనస్థాపం చెందిన సదరు విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతికందిన కొడుకు కుటుంబానికి అండగా ఉంటాడని ఆశలు పెట్టుకున్న ఆ తల్లికి.. కుమారుడు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం తీరని విషాదాన్ని మిగిల్చింది.

ఇదీ చదవండి

సరదా ఆటకు.. ఆరేళ్ల చిన్నారి బలి

Intro:333


Body:777


Conclusion:వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బాధ్యులు డాక్టర్ రాజశేఖర్ ఆరోపించారు .విజయవాడలో చంద్రబాబు నాయుడు ఇల్లు మునగాల దురుద్దేశంతోనే మూడు టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రకాశం బ్యారేజ్ లో నాలుగు టీఎంసీల నీటిని ల గురించి వరద నీటితో ముంచారని అన్నారు. వచ్చిన వరద నీటిని వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహించి రాయలసీమ కు నీరు రాకుండా చేశారని కడప జిల్లా బద్వేలులో ఆయన ఈరోజు అన్నారు.

కడపజిల్లా బద్వేల్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది .సందర్భంగా తెలుగుదేశం నియోజకవర్గ బాధ్యులు డాక్టర్ రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకొని వరద బాధితులను ఆదుకోవాలని కోరారు.
బైట్స్
డాక్టర్ రాజశేఖర్, తెలుగు దేశ పార్టీ నియోజకవర్గ బాధ్యులు బద్వేల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.