ETV Bharat / state

కళాశాల సిబ్బందితో... ఎస్ఎఫ్ఐ నాయకుల వాగ్వాదం

అనంతపురం జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలలో వివాదం చోటు చేసుకుంది. విద్యార్థినిని ఫీజు కట్టలేదంటూ సిబ్బంది తరగతి గది బయట నిలబెట్టారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు కళాశాలకు చేరుకుని సిబ్బందితో వాగ్విదానికి దిగి... ఫర్నీచర్​ ధ్వంసం చేశారు.

author img

By

Published : Sep 11, 2019, 8:52 PM IST

కళాశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఎస్ఎఫ్ఐ నాయకులు
కళాశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఎస్ఎఫ్ఐ నాయకులు

అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థిని ఫీజు చెల్లింపు విషయంలో సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదాస్పంగా మారింది. బస్టాండ్ సమీపంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ఫీజు కట్టలేదంటూ సిబ్బంది... తరగతి గది బయట నిలబెట్టారు. విషయాన్ని బాధితురాలు తన తండ్రికి తెలియజేసింది. ఇంతలో సమాచారం అందుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు... కళాశాలకు చేరుకుని సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. విద్యార్థినిని ఎలా బయట నిలబెడతారని నిలదీశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. విద్యార్థి సంఘం నాయకులు కళాశాల ఫర్నిచర్​ ధ్వంసం చేశారు. ప్రిన్సిపల్ మాత్రం తమ కళాశాలలో ఎలాంటి గొడవ జరగలేదని.. తాము ఎవరినీ ఫీజుల విషయంలో ఒత్తిడి చేయలేదని చెప్పారు.

కళాశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఎస్ఎఫ్ఐ నాయకులు

అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థిని ఫీజు చెల్లింపు విషయంలో సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదాస్పంగా మారింది. బస్టాండ్ సమీపంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ఫీజు కట్టలేదంటూ సిబ్బంది... తరగతి గది బయట నిలబెట్టారు. విషయాన్ని బాధితురాలు తన తండ్రికి తెలియజేసింది. ఇంతలో సమాచారం అందుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు... కళాశాలకు చేరుకుని సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. విద్యార్థినిని ఎలా బయట నిలబెడతారని నిలదీశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. విద్యార్థి సంఘం నాయకులు కళాశాల ఫర్నిచర్​ ధ్వంసం చేశారు. ప్రిన్సిపల్ మాత్రం తమ కళాశాలలో ఎలాంటి గొడవ జరగలేదని.. తాము ఎవరినీ ఫీజుల విషయంలో ఒత్తిడి చేయలేదని చెప్పారు.

Intro:ap_tpt_51_11_mrutyuvuto_poraatam_bidda_aakali_teerche_aaratam_pkg_avb_ap10105

మృత్యువుతో పోరాటం ఒకవైపు బిడ్డ ఆకలి తీర్చే ఆరాటం మరోవైపు
* కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలుBody:*ఏనుగుల దాడులతో నిండా మునుగుతున్న రైతన్న*


చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో అధికభాగం కౌండిన్య అడవులు వ్యాపించి ఉన్నాయి. ఈ అడవులలో ఏనుగులు బృందాలు బృందాలుగా విడిపోయి నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో అటవీ సమీప ప్రాంతాల గ్రామాలపై దాడి చేస్తూ రైతన్నలకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇదేవిధంగా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం గాంధీనగర్ అటవీ ప్రాంతంలో సుమారు 15 రోజుల నుంచి ఏనుగుల మంద రైతులను హడలెత్తిస్తున్నాయి. ప్రతిరోజు పంట పొలాలపై దాడులు చేస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. అయితే ఇది 15 రోజుల నుంచి మాత్రమే కాదని గత మూడు దశాబ్దాలుగా తన ప్రాంతంలో పంట పొలాలు ఖండించి బాగుపడిన రైతు ఒక్కరు లేరని, మూడు దశాబ్దాల క్రితం పచ్చని పంట పొలాలతో అలలాడే తమ ప్రాంతంలోని వ్యవసాయ భూములన్నీ ఏనుగుల దెబ్బలతో నేడు బీడు భూములుగా మిగిలాయని చాలామంది నష్టాలు భరించలేక నగరాలకు వలస వెళ్లిపోయారని ప్రస్తుతం ఉన్న తాము వ్యవసాయం మానివేసి పశువులను మేపుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగించే పరిస్థితి ఉందని అక్కడి రైతులు పేర్కొంటున్నారు అయితే తాజాగా ఏనుగులు పశువుల పై కూడా దాడి చేసి వాటి ప్రాణాలు తీస్తుండడంతో ఎలా బతకాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నామనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే ఓ లేగ దూడను చంపేసిన ఏనుగులు, ఓ ఆవు వెన్నుపూస ను విరగ్గొట్టాయని, దీంతో గత 11 రోజులుగా ఆ ఆవు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోందంటూ రైతులు వాపోతున్నారు.

*ఓవైపు మృత్యువుతో పోరాటం మరోవైపు బిడ్డ ఆకలి తీర్చే ఆరాటం*

కాగా ఏనుగుల దాడిలో వెన్నుపూస విరిగి లేవలేని స్థితిలో చావు బతుకుల మధ్య మృత్యువుతో పోరాటం చేస్తున్న ఆవు తన బిడ్డ ఆకలి తీర్చేందుకు పడుతున్న ఆరాటం చూస్తే కన్నీళ్లు ఆగవు. ఏనుగుల దాడులకు సరిగ్గా 11 రోజుల క్రితం దూడను ప్రసవించిన ఆవు వెన్నుపూస విరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ 11 రోజులుగా సరైన మేత లేక పోయినా తన బిడ్డ ఆకలితో పొదుగు దగ్గరకు వచ్చేటప్పటికి తన ఒంట్లోని శక్తి నంతా పాలుగా మార్చి బిడ్డ ఆకలి తీరుస్తోంది ఈ దృశ్యాలను చూస్తూ గ్రామస్తులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. దూడ సైతం తన తల్లిని వదిలి ఎక్కడికి వెళ్లేది లేదంటూ ఆవు పక్కనే ఉంటూ నీరసంగా కాలం వెళ్లబుచుతోంది.

*చావే శరణ్యం*

ఏనుగుల దాడుల నుంచి తమను తమ పంటపొలాలను తమ పశువులను కాపాడాలని ఏనుగులు పూర్తిగా తమ గ్రామం వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని గాంధీనగర్ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమకు వ్యవసాయం ఒకటే తెలుసని మరే పని తెలియదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక చావే శరణ్యమని ఇక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బైట్ 1: కృష్ణమూర్తి, పాడిరైతు
బైట్ 2: వసరాయప్ప, గ్రామస్తుడు, గాంధీనగర్
బైట్ 3: తులసి కుమార్, రైతు, గాంధీ నగర్.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.