![several injured by the car accident in penukonda ananthpur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6286477_963_6286477_1583292345213.png)
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని గుట్టూరు సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై బెంగుళూరు నుంచి అనంత వైపు వెళ్తున్న ఓ కారు బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అత్యవసర వాహనంలో చెన్నేకొత్తపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చదవండి...ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం