పోలీసుల కళ్లుగప్పి.. అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు కొందరు వ్యక్తులు. ఎప్పటికప్పుడు పోలీసులు వీటిని అడ్డుకున్నప్పటికి సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా.. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం చాబాల గ్రామానికి చెందిన అంజి కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం ప్యాకెట్లు తెపించాడు.
వాటిని ఓ బిందెలో ఉంచి.. తన ఇంటి ముందు గొయ్యి తీసి పాతిపెట్టి వ్యాపారం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బిందెను బయటకు తీయించగా.. అందులో 75 కర్ణాటక మద్యం ప్యాకెట్లు బయటపడ్డాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని.. ఆ వ్యక్తి అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: