ETV Bharat / state

ఉద్యోగాలిప్పిస్తానని నకిలీ పోలీసు మోసం.. రూ.50 లక్షలు వసూలు - అనంతపురంలో ఉద్యోగాల మోసం

Jobs Fraud: నకిలీ పోలీసు​గా అవతారమెత్తాడు కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువకుడు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్తూ.. మోసాలకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు మీకే అంటూ నిరుద్యోగుల దగ్గర నుంచి నగదు వసూలు చేసాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దాదాపు రూ.50 లక్షల వరకు వసూలు చేశాడని పోలీసులు తెలిపారు.

Jobs Fraud
నకిలీ పోలీస్
author img

By

Published : Nov 25, 2022, 7:26 PM IST

Fraud in name of jobs : కర్నూలు జిల్లా మద్దికేర గ్రామానికి చెందిన బండారు పృథ్వి అనే యువకుడు ఇంటర్మీడియట్​ వరకు చదువుకున్నాడు. తర్వాత చదువు మానేసి ఓ మెడికల్​ కళాశాలలో ఉద్యోగంలో చేరాడు. జల్సాలకు అలవాటు పడిన పృథ్వి.. సులువుగా డబ్బు సంపాదించే మార్గాల కోసం వెతికి.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పూనుకున్నాడు. ఇలా మోసాలు చేస్తూ.. చివరికి అనంతపురం జిల్లా గుంతకల్​ పోలీసుల చేతికి చిక్కాడు. గుంతకల్ పోలీసులు ఇతని గురించి సమాచారం అందటంతో అరెస్టు చేశారు.

ఇతని వద్ద నుంచి ​2 లక్షల 5 వేల రూపాయల నగదు, రెండు ద్విచక్రవాహనాలు, మోసాలకు పాల్పండేేందుకు వినియోగించిన పోలీస్ దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్​ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నానని నిరుద్యోగులను నమ్మించి.. పోలీస్, వైద్యశాఖలో ఉద్యోగాల పేరుతో ఎర వేశాడని పోలీసులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్లు వెల్లడించారు. గుంతకల్​ నుంచి 11 మంది బాధితులున్నారని పేర్కొన్నారు. ఇటువంటి వారి పట్ల నిరుద్యోగులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Fraud in name of jobs : కర్నూలు జిల్లా మద్దికేర గ్రామానికి చెందిన బండారు పృథ్వి అనే యువకుడు ఇంటర్మీడియట్​ వరకు చదువుకున్నాడు. తర్వాత చదువు మానేసి ఓ మెడికల్​ కళాశాలలో ఉద్యోగంలో చేరాడు. జల్సాలకు అలవాటు పడిన పృథ్వి.. సులువుగా డబ్బు సంపాదించే మార్గాల కోసం వెతికి.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పూనుకున్నాడు. ఇలా మోసాలు చేస్తూ.. చివరికి అనంతపురం జిల్లా గుంతకల్​ పోలీసుల చేతికి చిక్కాడు. గుంతకల్ పోలీసులు ఇతని గురించి సమాచారం అందటంతో అరెస్టు చేశారు.

ఇతని వద్ద నుంచి ​2 లక్షల 5 వేల రూపాయల నగదు, రెండు ద్విచక్రవాహనాలు, మోసాలకు పాల్పండేేందుకు వినియోగించిన పోలీస్ దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్​ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నానని నిరుద్యోగులను నమ్మించి.. పోలీస్, వైద్యశాఖలో ఉద్యోగాల పేరుతో ఎర వేశాడని పోలీసులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్లు వెల్లడించారు. గుంతకల్​ నుంచి 11 మంది బాధితులున్నారని పేర్కొన్నారు. ఇటువంటి వారి పట్ల నిరుద్యోగులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

పోాలీస్​ పేరుతో మోసం.. యువకుడ్ని అరెస్టు చేసిన పోలీసులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.