ETV Bharat / state

modi on uravakonda: ఉరవకొండ రోడ్డు ప్రమాదంపై ప్రధాని​ మోదీ విచారం

author img

By

Published : Feb 7, 2022, 10:32 AM IST

modi, Governor on uravakonda road accident: ఉరవకొండ బూదగవి రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో మరణించిన 9 మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై గవర్నర్​ భిశ్వభూషన్​ హరిచందన్​ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.

Governor
గవర్నర్

modi on uravakonda road accident: ఉరవకొండ బూదగవి రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషన్​ హరిచందన్​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన 9 మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ప్రధాని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. రహదారి భద్రత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని గవర్నర్​ సూచించారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే...

ఉరవకొండ మండలం నిమ్మగల్లు గ్రామస్తులు కర్ణాటక బళ్లారిలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి కారులో బయల్దేరారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.

ఇది చదవండి: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. 9 మంది దుర్మరణం

modi on uravakonda road accident: ఉరవకొండ బూదగవి రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషన్​ హరిచందన్​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన 9 మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ప్రధాని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. రహదారి భద్రత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని గవర్నర్​ సూచించారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే...

ఉరవకొండ మండలం నిమ్మగల్లు గ్రామస్తులు కర్ణాటక బళ్లారిలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి కారులో బయల్దేరారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.

ఇది చదవండి: పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. 9 మంది దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.