అనంతపురం జిల్లా రాయదుర్గం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు పంచాయతీ రాజ్ ఉద్యోగులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది నిరసన చేపట్టారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో జీవో ఎంఎస్ 2 ను వెంటనే రద్దు చేయాలని నల్లబ్యాడ్జీలను ధరించి ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీలకు రాజ్యంగం కల్పించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని వారు విమర్శించారు.
పంచాయతీ కార్యదర్శులను డీడీఓ లుగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం నాయకులు, ఎంపీడీఓ కొండయ్య, ఈవోఆర్డీ రఘు రామారావు, సూపరిండెంట్ బల రామారావు, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
లైవ్ వీడియో: మద్యం మత్తులో క్లీనర్.. మహిళపై దూసుకెళ్లిన లారీ