అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో దారుణం జరిగింది. పట్టణంలోని పార్వతీనగర్కు చెందిన నాగరాజు అనే వ్యక్తి.. తన ఇరుగు పొరుగు వారు గొడవ పడుతుంటే వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంతలో గొడవ పడుతున్న వారిలో ఓ వ్యక్తి.. తమ ఇద్దరి మధ్య తల దూర్చడానికి నీవెవరంటూ నిలదీశాడు. ఇంట్లో కుళాయికి సంబంధించిన పైపు తీసుకువచ్చి నాగరాజును చితకబాదాడు. తీవ్ర గాయాలపాలైన నాగరాజు... రక్త స్రావంతో కల్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్కు రాగానే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: జర్నలిస్టులపై దాడులు ఆపాలి