ETV Bharat / state

తగువు నడుమ తల దూరిస్తే.. తల పగిలింది! - అనంతపురంలో మనుష్యుల వివాదాల వార్తలు

రెండు ఇళ్ల వారు తగువు పడుతుంటే.. సర్ది చెబుదామని తలదూర్చిన ఓ వ్యక్తి... చివరకు తన తలే పగలగొట్టించుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణంలో జరిగింది.

man injured in conflict issue at kalyandurgam
ఇద్దరి మధ్యకు వెళ్లి తీవ్ర గాయాలపాలైన వ్యక్తి
author img

By

Published : Jun 7, 2020, 4:06 AM IST

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో దారుణం జరిగింది. పట్టణంలోని పార్వతీనగర్​కు చెందిన నాగరాజు అనే వ్యక్తి.. తన ఇరుగు పొరుగు వారు గొడవ పడుతుంటే వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంతలో గొడవ పడుతున్న వారిలో ఓ వ్యక్తి.. తమ ఇద్దరి మధ్య తల దూర్చడానికి నీవెవరంటూ నిలదీశాడు. ఇంట్లో కుళాయికి సంబంధించిన పైపు తీసుకువచ్చి నాగరాజును చితకబాదాడు. తీవ్ర గాయాలపాలైన నాగరాజు... రక్త స్రావంతో కల్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్​కు రాగానే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇద్దరి మధ్యకు వెళ్లి తీవ్ర గాయాలపాలైన వ్యక్తి

ఇదీ చూడండి: జర్నలిస్టులపై దాడులు ఆపాలి

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో దారుణం జరిగింది. పట్టణంలోని పార్వతీనగర్​కు చెందిన నాగరాజు అనే వ్యక్తి.. తన ఇరుగు పొరుగు వారు గొడవ పడుతుంటే వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంతలో గొడవ పడుతున్న వారిలో ఓ వ్యక్తి.. తమ ఇద్దరి మధ్య తల దూర్చడానికి నీవెవరంటూ నిలదీశాడు. ఇంట్లో కుళాయికి సంబంధించిన పైపు తీసుకువచ్చి నాగరాజును చితకబాదాడు. తీవ్ర గాయాలపాలైన నాగరాజు... రక్త స్రావంతో కల్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్​కు రాగానే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇద్దరి మధ్యకు వెళ్లి తీవ్ర గాయాలపాలైన వ్యక్తి

ఇదీ చూడండి: జర్నలిస్టులపై దాడులు ఆపాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.