ETV Bharat / state

క్వారంటైన్ కేంద్రంలో పోలీసులపై రాళ్ల దాడి

author img

By

Published : Apr 14, 2020, 1:31 PM IST

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎస్​కేడీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న కరోనా అనుమానితులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సీఐ రాజశేఖరరెడ్డితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.

పోలీసులపై రాళ్లతో దాడి చేసిన వలస కార్మికులు
పోలీసులపై రాళ్లతో దాడి చేసిన వలస కార్మికులు
క్వారంటైన్‌ కేంద్రంలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎస్​కేడీ ఇంజినీరింగ్‌ కళాశాలలోని క్వారంటైన్‌లో ఉంటున్న కరోనా అనుమానితులు.. పోలీసులపై దాడికి దిగారు. తమను ఇళ్లకు పంపేవరకు భోజనం చేయబోమంటూ నిరసన తెలిపారు. గస్తీ కాస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్​ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు పంపిచడం వీలు కాదని పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఐనప్పటికీ వినకుండా పోలీసులపై మట్టి గడ్డలతో, రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో సీఐ రాజశేఖరరెడ్డితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. చివరికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించి వారిని కేంద్రాలకే పరిమితం చేశారు.

క్వారంటైన్‌ కేంద్రంలో ఉద్రిక్తత

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎస్​కేడీ ఇంజినీరింగ్‌ కళాశాలలోని క్వారంటైన్‌లో ఉంటున్న కరోనా అనుమానితులు.. పోలీసులపై దాడికి దిగారు. తమను ఇళ్లకు పంపేవరకు భోజనం చేయబోమంటూ నిరసన తెలిపారు. గస్తీ కాస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్​ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు పంపిచడం వీలు కాదని పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఐనప్పటికీ వినకుండా పోలీసులపై మట్టి గడ్డలతో, రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో సీఐ రాజశేఖరరెడ్డితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. చివరికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించి వారిని కేంద్రాలకే పరిమితం చేశారు.

ఇదీ చూడండి:

వలస కూలీల బతుకు ఛిద్రం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.