ETV Bharat / state

చేయీ చేయీ కలిపారు..చేయూతనందించారు

ఆ కుటుంబానికి పూట గడవడం కష్టం.. ఇంటి అద్దె చెల్లించలేక.. పిల్లలను బడికి పంపలేక నానా తిప్పలు పడ్డారు. అయితే పొదుపు వారి ఆత్మస్థైర్యాన్ని పెంచింది. దానికి మెప్మా భరోసా తోడైంది. ఇంకేం...కష్టాలు పోయి ఆ కుటుంబం చిరు పారిశ్రామికవేత్తలుగా మారిపోయింది.

author img

By

Published : Jul 25, 2019, 8:02 AM IST

mepma-saves-a-family-problems
చేయీ చేయీ కలిపారు..చేయూతనందించారు

రోజూ కష్టాలు పీడించేవి. వస్త్ర తయారీ పరిశ్రమ ఉన్న చోటే వ్యాపారం ప్రారంభిస్తే దుకాణం సర్దేయాల్సిందే అంటూ ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు...ఏ దారీ లేక ఈ మార్గం ఎంచుకున్నారంటూ అవమానాలు అన్నీ భరించారు. ఆ కుటుంబం ఆత్మస్థైర్యం, పట్టుదల కోల్పోలేదు. అనంతపురం జిల్లా గార్మెంట్ పరిశ్రమకు పెట్టిందిపేరు. ఈ అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు పామిడికి చెందిన పర్వీన్, ఫకృన్నిసా.

లక్షల రూపాయల పెట్టుబడులు అవసరమైన వస్త్ర తయారీ రంగం... ఒకప్పుడు పేదలకు అందుబాటులో ఉండేది కాదు. అయితే మెప్మా సహకారంతో దూసుకెళ్తున్నారు నిరుపేదలు మహిళలు.

కుటుంబపోషణే భారంగా, కఠిన దారిద్య్రం అనుభవిస్తున్న మహిళలకు... మెప్మా సహకరించింది. టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్లు ఇప్పించి... తక్కువ వడ్డీకి రుణాలూ అందేలా చూస్తోంది. ఫలితం.. కష్టాలకు టాటా చెప్పేసి వస్త్రతయారీ రంగంలో దూసుకెళ్తున్నారు. మహిళల కోట్స్ తయారీ పరిశ్రమతో పాటు... వివిధ మతాల మహిళలు ధరించే వస్త్రాలనూ తయారు చేస్తున్నారు.

దక్షిణాది రాష్ట్రాలతో పాటు....దిల్లీ, జమ్మూ కాశ్మీర్ వరకు ఎగుమతి చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఫోన్ ద్వారా గార్మెంట్ కోసం ఆర్డర్లు చేస్తూ... ముందుగానే ఆన్‌లైన్ ద్వారా డబ్బు బదిలీ చేస్తున్నారు.

ఎన్నో కష్టాలు దాటి ఇప్పుడు మంచి జీవితమే గడుపుతున్నా... గతంలో వెంటాడిన బాధలు, అవమానాలు... మరింత ప్రేరేపిస్తున్నాయంటున్నారు వీరంతా.! తమ అబివృద్ధికి కారణం కార్మికులే అని విశ్వసించే యజమానులు... తమ పిల్లల విద్యకు ఆధారం ఈ రంగమే అని నమ్మే గృహిణులు.... కలిసిమెలసి పని చేసుకుంటున్నారు.

వస్త్ర తయారీ పరిశ్రమలో వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి లభించేలా... టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి మెప్మా అధికారులు ప్రణాళిక రచించారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారికి ఉన్న ఆసక్తి ఏపాటిదో గుర్తించి... శిక్షణ ఇప్పిస్తున్నారు. పరిశ్రమ నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలనూ మెరుగుపరుస్తున్నారు. అనంతపురం జిల్లాలో కరవు దెబ్బకు... జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ సాగు కష్టమే. అందువల్ల వలస వెళ్లకుండా..... అధికారులు వస్త్ర పరిశ్రమపై దృష్టి పెట్టారు.

ఇవి కూడా చదవండి:

'రైతులకు పశువులు దూరం-కరవే కారణం'

చేయీ చేయీ కలిపారు..చేయూతనందించారు

రోజూ కష్టాలు పీడించేవి. వస్త్ర తయారీ పరిశ్రమ ఉన్న చోటే వ్యాపారం ప్రారంభిస్తే దుకాణం సర్దేయాల్సిందే అంటూ ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు...ఏ దారీ లేక ఈ మార్గం ఎంచుకున్నారంటూ అవమానాలు అన్నీ భరించారు. ఆ కుటుంబం ఆత్మస్థైర్యం, పట్టుదల కోల్పోలేదు. అనంతపురం జిల్లా గార్మెంట్ పరిశ్రమకు పెట్టిందిపేరు. ఈ అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు పామిడికి చెందిన పర్వీన్, ఫకృన్నిసా.

లక్షల రూపాయల పెట్టుబడులు అవసరమైన వస్త్ర తయారీ రంగం... ఒకప్పుడు పేదలకు అందుబాటులో ఉండేది కాదు. అయితే మెప్మా సహకారంతో దూసుకెళ్తున్నారు నిరుపేదలు మహిళలు.

కుటుంబపోషణే భారంగా, కఠిన దారిద్య్రం అనుభవిస్తున్న మహిళలకు... మెప్మా సహకరించింది. టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్లు ఇప్పించి... తక్కువ వడ్డీకి రుణాలూ అందేలా చూస్తోంది. ఫలితం.. కష్టాలకు టాటా చెప్పేసి వస్త్రతయారీ రంగంలో దూసుకెళ్తున్నారు. మహిళల కోట్స్ తయారీ పరిశ్రమతో పాటు... వివిధ మతాల మహిళలు ధరించే వస్త్రాలనూ తయారు చేస్తున్నారు.

దక్షిణాది రాష్ట్రాలతో పాటు....దిల్లీ, జమ్మూ కాశ్మీర్ వరకు ఎగుమతి చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఫోన్ ద్వారా గార్మెంట్ కోసం ఆర్డర్లు చేస్తూ... ముందుగానే ఆన్‌లైన్ ద్వారా డబ్బు బదిలీ చేస్తున్నారు.

ఎన్నో కష్టాలు దాటి ఇప్పుడు మంచి జీవితమే గడుపుతున్నా... గతంలో వెంటాడిన బాధలు, అవమానాలు... మరింత ప్రేరేపిస్తున్నాయంటున్నారు వీరంతా.! తమ అబివృద్ధికి కారణం కార్మికులే అని విశ్వసించే యజమానులు... తమ పిల్లల విద్యకు ఆధారం ఈ రంగమే అని నమ్మే గృహిణులు.... కలిసిమెలసి పని చేసుకుంటున్నారు.

వస్త్ర తయారీ పరిశ్రమలో వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి లభించేలా... టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి మెప్మా అధికారులు ప్రణాళిక రచించారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారికి ఉన్న ఆసక్తి ఏపాటిదో గుర్తించి... శిక్షణ ఇప్పిస్తున్నారు. పరిశ్రమ నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలనూ మెరుగుపరుస్తున్నారు. అనంతపురం జిల్లాలో కరవు దెబ్బకు... జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ సాగు కష్టమే. అందువల్ల వలస వెళ్లకుండా..... అధికారులు వస్త్ర పరిశ్రమపై దృష్టి పెట్టారు.

ఇవి కూడా చదవండి:

'రైతులకు పశువులు దూరం-కరవే కారణం'

Intro:విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కిమిడి నాగార్జున యువ నాయకులు ప్రెస్ మీట్
2017 పాదయాత్రలో లో జగన్ పాదయాత్ర చేస్తూ నేను ఉన్నాను నీ విన్నాను
అని మహిళలకు 45 సంవత్సరాల కి కి పెన్షన్ ఇస్తానని ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ బడుగు బలహీన మైనారిటీ ఎస్సీ వర్గాల మహిళలకు ఇస్తానని హామీ ఇచ్చిన జగన్
జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు ప్రస్తావించగా సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేయడంపై రాష్ట్రం అంతటా ఉత్కంఠ నెలకొంది


Body: అసెంబ్లీని నియమాలకు అనుగుణంగా నడుచుకున్నా తెలుగుదేశం పార్టీ సభ్యులను ముగ్గురిని సస్పెండ్ చేయడంపై విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది


Conclusion:
ఒక అమ్మ ఒడిలో పథకంలో స్పష్టత లేదు
ఇసుక విధానంలో స్పష్టత లేదu
రైతులకు సంవత్సరానికి వేసే అమౌంట్ లో కూడా స్పష్టత లేదు
అన్న క్యాంటీన్లు మూసి వేయడం జరిగింది
ఇంటర్ వారికి మధ్యాహ్న భోజనం పథకం తీసేసారు
మహిళలకు 45 సంవత్సరాలకే పెన్షన్ అన్న విషయంలో కూడా స్పష్టత లేని జగన్ నిలదీసిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.