అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటపురంలో వెంకటేశులు అనే రైతుకు చెందిన అరవై మామిడి చెట్లను గుర్తు తెలియని దుండగులు నరికివేశారు. మూడేళ్ల క్రితం ఉపాధి హామీ పథకంలో ఐదేకరాల్లో 400 చెట్లను వెంకటేశులు నాటాడు. అయితే వెంకటేశులు ఎదుగుదలను ఓర్వలేక ప్రత్యర్థులు చెట్లను నరికి వేసినట్లు రైతులు స్పష్టం చేస్తున్నారు. కళ్యాణదుర్గం తెదేపా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు, పలువురు తెదేపా నాయకులు సంఘటనా స్థలాన్ని చేరుకోని చెట్లను పరిశీలించి రైతును పరామర్శించారు.
ఇదీ చదవండి:'మట్టిని తరలిస్తే.. కేసులా..?'