ETV Bharat / state

పుట్టపర్తిలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

author img

By

Published : Feb 22, 2020, 3:02 PM IST

పుట్టపర్తి ప్రశాంత నిలయంలో శివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరిపారు. సాయి ఈశ్వర లింగానికి అష్టోత్తరపూజ, మహారుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రంతా అఖండ భజన చేశారు.

maha shivarathri celebrations in putaparthi  Prasanthi Nilayam at ananthapuram
పుట్టపర్తిలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

పుట్టపర్తిలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సాయికుల్వంత్ మందిరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. వేదపఠనంతో వేడుకలు ప్రారంభించారు. నాదస్వరం, పంచవాద్యం, సంగీత కచేరి నిర్వహించారు. వేదపండితులు సాయి ఈశ్వర లింగాన్ని.. భజన మందిరం నుంచి సాయికుల్వంత్ మందిరంలోకి తీసుకొచ్చారు. మహాసమాధి చెంత శివలింగాన్ని కొలువుదీర్చి సాయి అష్టోత్తరం, మహారుద్రాభిషేకం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన అఖండ భజన.. రాత్రంతా నిర్విరామంగా కొనసాగుతూ శనివారం ఉదయానికి ముగిసింది.

పుట్టపర్తిలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సాయికుల్వంత్ మందిరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. వేదపఠనంతో వేడుకలు ప్రారంభించారు. నాదస్వరం, పంచవాద్యం, సంగీత కచేరి నిర్వహించారు. వేదపండితులు సాయి ఈశ్వర లింగాన్ని.. భజన మందిరం నుంచి సాయికుల్వంత్ మందిరంలోకి తీసుకొచ్చారు. మహాసమాధి చెంత శివలింగాన్ని కొలువుదీర్చి సాయి అష్టోత్తరం, మహారుద్రాభిషేకం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన అఖండ భజన.. రాత్రంతా నిర్విరామంగా కొనసాగుతూ శనివారం ఉదయానికి ముగిసింది.

ఇదీ చదవండి:

ప్రభల ఉత్సవం.. త్రినేత్రుడి దర్శనం అపూర్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.