ETV Bharat / state

'సీఎం జగన్​ రైతులకు అన్యాయం చేశారు'

రెండేళ్ల పాలనలో రైతులకు చేసిన మోసాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి సమాధానం చెప్పాలని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సాగునీటి వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వీర్యం చేసి రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు.

author img

By

Published : Jul 6, 2021, 4:02 PM IST

kalava srinivas comments on cm jagan on development to farmers
kalava srinivas comments on cm jagan on development to farmers

"అనంతపురం రైతులకు అన్యాయం చేసిన సీఎం జగన్​.. జిల్లాకు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు" అని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. జిల్లా రైతాంగానికి ఇవ్వాల్సిన ఇన్​పుట్ సబ్సిడీ రూ.930 కోట్ల మంజూరులో ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రెండేళ్ల పాలనలో రైతులకు చేసిన మోసాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

"రాయదుర్గం పట్టణంలో జూలై 8న ప్రభుత్వం నిర్వహిస్తున్నది రైతు దినోత్సవం కాదు.. రైతు విద్రోహ దినోత్సవం. రైతులకు హక్కుగా రావాల్సిన రాయితీలను నిలిపివేశారు. ఈ క్రాప్ బుకింగ్​లో జరిగిన అవకతవకలతో లక్షలాది మంది రైతులు ఇన్సూరెన్స్​కు దూరమయ్యారు. అనంతపురం జిల్లా సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బీటీపీ ప్రాజెక్ట్, ఉంతకల్లు రిజర్వాయర్ పనులకు నిధులు ఎందుకు మంజూరు చేయలేదు. సాగునీటి వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వీర్యం చేసి రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం సరికాదు" - కాలవశ్రీనివాసులు, తెదేపా పొలిట్ బ్యూర్ సభ్యుడు

"అనంతపురం రైతులకు అన్యాయం చేసిన సీఎం జగన్​.. జిల్లాకు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు" అని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ప్రశ్నించారు. జిల్లా రైతాంగానికి ఇవ్వాల్సిన ఇన్​పుట్ సబ్సిడీ రూ.930 కోట్ల మంజూరులో ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రెండేళ్ల పాలనలో రైతులకు చేసిన మోసాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

"రాయదుర్గం పట్టణంలో జూలై 8న ప్రభుత్వం నిర్వహిస్తున్నది రైతు దినోత్సవం కాదు.. రైతు విద్రోహ దినోత్సవం. రైతులకు హక్కుగా రావాల్సిన రాయితీలను నిలిపివేశారు. ఈ క్రాప్ బుకింగ్​లో జరిగిన అవకతవకలతో లక్షలాది మంది రైతులు ఇన్సూరెన్స్​కు దూరమయ్యారు. అనంతపురం జిల్లా సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బీటీపీ ప్రాజెక్ట్, ఉంతకల్లు రిజర్వాయర్ పనులకు నిధులు ఎందుకు మంజూరు చేయలేదు. సాగునీటి వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వీర్యం చేసి రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడం సరికాదు" - కాలవశ్రీనివాసులు, తెదేపా పొలిట్ బ్యూర్ సభ్యుడు

ఇదీ చదవండి:

CM TOUR: ఈ నెల 8, 9న కడప, అనంతపురంలో సీఎం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.