ETV Bharat / state

'బీఎస్ 4' కేసు: జేసీ ప్రభాకర్​ రెడ్డి, అస్మిత్​రెడ్డిల విచారణ పూర్తి

author img

By

Published : Jun 22, 2020, 9:23 AM IST

Updated : Jun 22, 2020, 11:46 AM IST

బీఎస్​-4 వాహనాల రిజిస్ట్రేషన్​ వ్యవహారంలో పోలీసు కస్టడీలో ఉన్న జేసీ ప్రభాకర్​రెడ్డి, అస్మిత్​రెడ్డిల విచారణ పూర్తైంది. పోలీసు విచారణను తప్పుబట్టిన ప్రభాకర్​రెడ్డి.. ఈ కేసులో మిగిలిన వారిని కూడా ప్రశ్నించి.. తప్పు ఎక్కడ జరిగిందో తేల్చాలని డిమాండ్​ చేశారు. తాను కొనని వాహనాలను సైతం తానే కొన్నట్లుగా పోలీసులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేసీ ప్రభాకర్​రెడ్డి, అస్మిత్​రెడ్డిల విచారణ పూర్తి
జేసీ ప్రభాకర్​రెడ్డి, అస్మిత్​రెడ్డిల విచారణ పూర్తి

బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారన్న అభియోగంపై పోలీసు కస్టడీలో ఉన్న జేసీ ప్రభాకర్​రెడ్డి, అస్మిత్​రెడ్డిల విచారణ పూర్తైంది. వీరిద్దరినీ ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు విచారించారు. మొత్తం 64 ప్రశ్నలతో విచారించి సమాచార నివేదికను తయారుచేశారు. పోలీసు విచారణ తీరును జేసీ ప్రభాకర్​రెడ్డి తప్పుబట్టారు. రిజిస్ట్రేషన్​ చేసిన అధికారులు, విక్రయదారులను ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అధికారులను నిలదీశారు. పోలీసుల ప్రశ్నావళి అంతా తానొక్కడే తప్పు చేసినట్లుగా ఉందని ప్రభాకర్​రెడ్డి ఆరోపించారు.

'మిగిలిన వారిని ప్రశ్నించాలి'

ఈ కేసులో మిగిలిన వారిని కూడా ప్రశ్నించి.. ఎక్కడ తప్పు జరిగిందో తేల్చాలని జేసీ ప్రభాకర్​రెడ్డి డిమాండ్​ చేశారు. ప్రతి వాహనం తన ఖాతా చెక్కుల ద్వారానే కొనుగోలు చేశానన్న ఆయన.. తాను కొనని వాహనాలను సైతం తానే కొన్నట్లుగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడప కేంద్ర కారాగారానికి తరలింపు

కస్టడీ ముగియడం వల్ల జేసీ ప్రభాకర్​రెడ్డి, అస్మిత్​రెడ్డిలకు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరిని అనంతపురం మేజిస్ట్రేట్​ కోర్టులో హాజరుపరిచారు. తర్వాత ఇద్దరినీ కడప కేంద్ర కారాగారానికి తరలించారు.

ఇదీ చూడండి:

టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడితే సహించేది లేదు: సోమిరెడ్డి

బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారన్న అభియోగంపై పోలీసు కస్టడీలో ఉన్న జేసీ ప్రభాకర్​రెడ్డి, అస్మిత్​రెడ్డిల విచారణ పూర్తైంది. వీరిద్దరినీ ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు విచారించారు. మొత్తం 64 ప్రశ్నలతో విచారించి సమాచార నివేదికను తయారుచేశారు. పోలీసు విచారణ తీరును జేసీ ప్రభాకర్​రెడ్డి తప్పుబట్టారు. రిజిస్ట్రేషన్​ చేసిన అధికారులు, విక్రయదారులను ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అధికారులను నిలదీశారు. పోలీసుల ప్రశ్నావళి అంతా తానొక్కడే తప్పు చేసినట్లుగా ఉందని ప్రభాకర్​రెడ్డి ఆరోపించారు.

'మిగిలిన వారిని ప్రశ్నించాలి'

ఈ కేసులో మిగిలిన వారిని కూడా ప్రశ్నించి.. ఎక్కడ తప్పు జరిగిందో తేల్చాలని జేసీ ప్రభాకర్​రెడ్డి డిమాండ్​ చేశారు. ప్రతి వాహనం తన ఖాతా చెక్కుల ద్వారానే కొనుగోలు చేశానన్న ఆయన.. తాను కొనని వాహనాలను సైతం తానే కొన్నట్లుగా చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడప కేంద్ర కారాగారానికి తరలింపు

కస్టడీ ముగియడం వల్ల జేసీ ప్రభాకర్​రెడ్డి, అస్మిత్​రెడ్డిలకు అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరిని అనంతపురం మేజిస్ట్రేట్​ కోర్టులో హాజరుపరిచారు. తర్వాత ఇద్దరినీ కడప కేంద్ర కారాగారానికి తరలించారు.

ఇదీ చూడండి:

టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడితే సహించేది లేదు: సోమిరెడ్డి

Last Updated : Jun 22, 2020, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.