కరోనా కర్ఫ్యూపై అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం మాట వినాలా ? లేక స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట వినాలా ? అని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తే..స్థానిక దుకాణదారులతో సమావేశమైన ఎమ్మెల్యే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే దుకణాలు తెరవాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు.
ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్రమంతటా ఒక విధంగా.., తాడిపత్రిలో మరో విధంగా ఉంటాయా అని ఎద్దేవా చేశారు. కరోనా కట్టడికి కర్ఫ్యూ సరైన నిర్ణయమేనన్న జేసీ..మద్యం దుకాణాలు, బస్సులను కూడా బంద్ చేయాలన్నారు.
ఇదీచదవండి: రాష్ట్రంలో రేపట్నుంచి రాత్రి కర్ఫ్యూ