ETV Bharat / state

వేరుశనగ విత్తనాల కోసం వచ్చి రైతు మృతి

అనంతపురం జిల్లా రాయదర్గం మార్కెట్​ యార్డులో విషాదం చోటు చేసుకుంది. వేరుశనగ విత్తనాల కోసం వచ్చిన రైతు.. క్యూలైన్లో మృతి చెందాడు.

author img

By

Published : Jul 10, 2019, 5:52 PM IST

వేరుశనగ విత్తనాల కోసం వచ్చి రైతు మృతి
వేరుశనగ విత్తనాల కోసం వచ్చి రైతు మృతి

నిన్న మొన్నటి వరకు వేరుశనగ విత్తనాల కోసం నిరసనలు, ధర్నాలతో కొనసాగిన రైతుల పాట్లు... ప్రాణాలు హరించే స్థాయికి చేరుకున్నాయి. ఈ మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గం మార్కెట్ యార్డులో విషాదం చోటు చేసుకుంది. విత్తనాల కోసం వచ్చిన రైతు ఈశ్వరప్ప.. క్యూ లైన్లో పడిగాల్పులు భరించలేక మృతి చెందాడు. ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి టోకెన్ల కోసం క్యూలో నిలబడ్డ ఈశ్వరప్ప... నీరసించిపోయాడు. అలాగే కష్టపడి టోకెన్లు తీసుకున్నాడు. బయటకు వచ్చిన వెంటనే తోటి రైతులతో కలిసి టీ తాగుతుండగా కుప్పకూలి కింద పడిపోయాడు. వెంటనే గ్రామానికి చెందిన రైతులు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతుడిని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామస్తుడిగా గుర్తించారు.

వేరుశనగ విత్తనాల కోసం వచ్చి రైతు మృతి

నిన్న మొన్నటి వరకు వేరుశనగ విత్తనాల కోసం నిరసనలు, ధర్నాలతో కొనసాగిన రైతుల పాట్లు... ప్రాణాలు హరించే స్థాయికి చేరుకున్నాయి. ఈ మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గం మార్కెట్ యార్డులో విషాదం చోటు చేసుకుంది. విత్తనాల కోసం వచ్చిన రైతు ఈశ్వరప్ప.. క్యూ లైన్లో పడిగాల్పులు భరించలేక మృతి చెందాడు. ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి టోకెన్ల కోసం క్యూలో నిలబడ్డ ఈశ్వరప్ప... నీరసించిపోయాడు. అలాగే కష్టపడి టోకెన్లు తీసుకున్నాడు. బయటకు వచ్చిన వెంటనే తోటి రైతులతో కలిసి టీ తాగుతుండగా కుప్పకూలి కింద పడిపోయాడు. వెంటనే గ్రామానికి చెందిన రైతులు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతుడిని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామస్తుడిగా గుర్తించారు.

ఇదీ చదవండి..

రైల్వేశాఖలో 2 లక్షల 98 వేల ఉద్యోగాలు

Intro:Ap_Vsp_91_10_Vithhanala_Golilu_Awareness_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటి
8008013325
( ) మనిషి మనుగడ, స్వార్ధం, అభివృద్ధి పేరిట అడవులను, చెట్లను నరికివేయడం వలన ఆక్సిజన్ శాతం పూర్తిగా పడిపోయే పరిస్థితి నుంచి కొలుకునేందుకు పర్యావరణ మార్గదర్శి వైశాఖి విత్తన బంతులను తయారు చేస్తోంది.


Body:మొక్కలు మొలవడానికి కావాల్సిన విత్తనాలను సేకరించి వాటిని ఆవుపేడ, మట్టిల మిశ్రమంతో బంతులను తయారుచేస్తున్నారు. ఈ బంతుల పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించి ఈ వర్షాకాలంలో చెట్లు లేని ప్రదేశంలో ఈ విత్తనాల బంతులను విసిరే విధంగా వీరు అవగాహన కల్పిస్తున్నారు.


Conclusion:విజయ్ నిర్మాన్ కంపెనీ అధినేత సూరపనేని విజయకుమార్ సహాయంతో పర్యావరణ మార్గదర్శి వైశాఖి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మొక్కలు పాలెంచడం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన చెంది మొక్కలను నాటడం ద్వారా భావితరాలకు మంచి ఆక్సిజన్ ను అందించగలిగినవారమవుతామని వారు ఆశించారు. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు దేవి ప్రసాద్ విత్తన బంతులపై పాటలను పాడారు.



బైట్: పర్యావరణ ప్రొఫెసర్ ఏయూ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.