అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం ఓరువాయిలో వెలసిన రేణుక ఎల్లమ్మ జాతర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రెండు రోజుల పాటు సాగే ఈ పులి పార్వేట వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సింహ వాహనంపై అమ్మవారు ఊరేగుతూ.. భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారు పులిపార్వేటకు బయలుదేరి వెళ్లారు. ఈ వేడుకను చూసేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు.
ఇవీ చూడండి...: అనంతపురంలో వైభవంగా ఉగాది వేడుకలు