ETV Bharat / state

' ఒక్క ఛాన్స్ అంటూ..అభివృద్ధిని ధ్వంసం చేశాడు'

author img

By

Published : Jun 10, 2020, 6:21 PM IST

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. వైకాపా ఏడాది పాలనపై అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన ఛార్జి​షీట్ విడుదల చేశారు.

former minister kaluva srinivasulu   released the charge sheet on the ysrcp year's rule.
వైకాపా పాలనపై కాలువ శ్రీనివాసులు ఛార్జ్​షీట్

వైకాపా ఏడాది పాలనపై అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఛార్జి​షీట్ విడుదల చేశారు. విధ్వంసానికి ఒక్క ఛాన్స్ పేరుతో.. వైకాపా పాలనలోని పలు అంశాలను ఛార్జి​షీట్​లో ప్రస్తావించారు. నయా నియంతృత్వ పోకడలతో జగన్ అన్ని వర్గాలను తీవ్ర నిరుత్సాహానికి గురిచేశారని ఆయన ధ్వజమెత్తారు. తెదేపా చేపట్టిన అనేక కార్యక్రమాలను రాజకీయ దురుద్దేశ్యంతో రద్దు చేస్తూ.. ఏడాది కాలంలో అభివృద్ధిని ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. విభజన హక్కులను సాధించకోవడంలో భాగంగా తెదేపా పనిచేసిందని గుర్తుచేశారు. సీఎం జగన్ హైదరాబాద్​లోని ఆస్తులను.. అక్కడి సీఎం కేసీఆర్​కు రాసిచ్చారని ఆరోపించారు. గతంలో ఎవ్వరూ చేయని విధంగా.. సీఎం జగన్ అధ్వాన్న పాలన సాగించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు పార్థసారధి అన్నారు.

వైకాపా ఏడాది పాలనపై అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఛార్జి​షీట్ విడుదల చేశారు. విధ్వంసానికి ఒక్క ఛాన్స్ పేరుతో.. వైకాపా పాలనలోని పలు అంశాలను ఛార్జి​షీట్​లో ప్రస్తావించారు. నయా నియంతృత్వ పోకడలతో జగన్ అన్ని వర్గాలను తీవ్ర నిరుత్సాహానికి గురిచేశారని ఆయన ధ్వజమెత్తారు. తెదేపా చేపట్టిన అనేక కార్యక్రమాలను రాజకీయ దురుద్దేశ్యంతో రద్దు చేస్తూ.. ఏడాది కాలంలో అభివృద్ధిని ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. విభజన హక్కులను సాధించకోవడంలో భాగంగా తెదేపా పనిచేసిందని గుర్తుచేశారు. సీఎం జగన్ హైదరాబాద్​లోని ఆస్తులను.. అక్కడి సీఎం కేసీఆర్​కు రాసిచ్చారని ఆరోపించారు. గతంలో ఎవ్వరూ చేయని విధంగా.. సీఎం జగన్ అధ్వాన్న పాలన సాగించారని తెదేపా జిల్లా అధ్యక్షుడు పార్థసారధి అన్నారు.

ఇదీ చూడండి. హమ్మయ్యా! తలనీలాలు సమర్పించాం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.