ETV Bharat / state

కరవు కోరల్లో అనంత రైతులు.. వర్షాల కోసం ఎదురుచూపులు

కరవు కోరల్లో చిక్కి అనంతపురం జిల్లా రైతులు అల్లాడిపోతున్నారు. నెల రోజులుగా చుక్క వర్షం లేని కారణంగా.. గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఐదేళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకున్న పండ్ల తోటలు... ఫలాన్నిచ్చే సమయంలో ఎండిపోతున్న తీరు కర్షకులను తీవ్రంగా కలచివేస్తోంది.

author img

By

Published : Aug 14, 2019, 7:02 AM IST

farmers-water-problems-in-ananthapuram
కరవు కోరల్లో అనంత రైతులు

ప్రతీ ఏటా.. అనంతపురం జిల్లా రైతులను కరవు కబళించేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా... జిల్లాలో మాత్రం ఈ ఏడాది 48 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌లో ఏడున్నర లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగుచేయాల్సి ఉండగా, లక్షా 80 వేల హెక్టార్లలో మాత్రమే రైతులు విత్తనాలు వేశారు. ఐదున్నర లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేయాల్సి ఉండగా, లక్షా 25 వేల హెక్టార్లలో మాత్రమే సాగుకు సిద్ధమయ్యారు. వర్షాలు లేక చాలాచోట్ల భూమిలోనే విత్తనం కలిసిపోయింది. జూన్‌లో కురిసిన కొద్దిపాటి వర్షానికి సాగుచేసిన వేరుశనగ మొలక దశలోనే ఎండిపోయింది. పండ్ల తోటలు సాగుచేసిన రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆత్మహత్యలే దిక్కంటూ కుమిలిపోతున్నారు.

ప్రాణాలు తీసుకుంటున్నారు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా వెయ్యి నుంచి 12 వందల అడుగుల లోతులో ఉన్న బోర్లకూ నీరందని పరిస్థితి కరవు తీవ్రతకు అద్దం పడుతోంది. రైతులు బోర్ల కోసం లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి తోటల్లోని చెట్లను బతికించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వృథా ప్రయాసలానే మారుతున్నాయి. తెచ్చుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించలేక.... కుటుంబాన్ని పోషించలేక గడచిన 3 నెలల్లోనే 17 మంది రెతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పెద్దదిక్కు కోల్పోయిన ఆ కుటుంబాలు అంతులేని ఆవేదనలో మునిగిపోయాయి.

జిల్లాలో ఒక్క ఎకరం భూమి కూడా పచ్చగా కళకళలాడుతూ లేదు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. కృష్ణా, తుంగభద్ర నదులు పొంగి పొర్లుతుండటంతో.... జిల్లాలోని చెరువులు, కాలువలన్నింటికీ నీరందించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

గోటితో పోయేది గొడ్డలి వరకు తీసుకొచ్చారు: పవన్

కరవు కోరల్లో అనంత రైతులు

ప్రతీ ఏటా.. అనంతపురం జిల్లా రైతులను కరవు కబళించేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నా... జిల్లాలో మాత్రం ఈ ఏడాది 48 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌లో ఏడున్నర లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగుచేయాల్సి ఉండగా, లక్షా 80 వేల హెక్టార్లలో మాత్రమే రైతులు విత్తనాలు వేశారు. ఐదున్నర లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేయాల్సి ఉండగా, లక్షా 25 వేల హెక్టార్లలో మాత్రమే సాగుకు సిద్ధమయ్యారు. వర్షాలు లేక చాలాచోట్ల భూమిలోనే విత్తనం కలిసిపోయింది. జూన్‌లో కురిసిన కొద్దిపాటి వర్షానికి సాగుచేసిన వేరుశనగ మొలక దశలోనే ఎండిపోయింది. పండ్ల తోటలు సాగుచేసిన రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆత్మహత్యలే దిక్కంటూ కుమిలిపోతున్నారు.

ప్రాణాలు తీసుకుంటున్నారు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా వెయ్యి నుంచి 12 వందల అడుగుల లోతులో ఉన్న బోర్లకూ నీరందని పరిస్థితి కరవు తీవ్రతకు అద్దం పడుతోంది. రైతులు బోర్ల కోసం లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి తోటల్లోని చెట్లను బతికించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వృథా ప్రయాసలానే మారుతున్నాయి. తెచ్చుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించలేక.... కుటుంబాన్ని పోషించలేక గడచిన 3 నెలల్లోనే 17 మంది రెతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పెద్దదిక్కు కోల్పోయిన ఆ కుటుంబాలు అంతులేని ఆవేదనలో మునిగిపోయాయి.

జిల్లాలో ఒక్క ఎకరం భూమి కూడా పచ్చగా కళకళలాడుతూ లేదు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. కృష్ణా, తుంగభద్ర నదులు పొంగి పొర్లుతుండటంతో.... జిల్లాలోని చెరువులు, కాలువలన్నింటికీ నీరందించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

గోటితో పోయేది గొడ్డలి వరకు తీసుకొచ్చారు: పవన్

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      :అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_46_13_Advocates_Complaints_On_S.I._AV_AP10004


Body:న్యాయవాది పట్ల దురుసుగా వ్యవహరించి చేసుకున్న ఎస్సై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కదిరి న్యాయవాదులు డీఎస్పీ కి ఫిర్యాదు చేశారు. కదిరి బార్ అసోసియేషన్ సభ్యుడు చత్రేనాయక్ పై ముదిగుబ్బ ఎస్సై శ్రీనివాసులు దురుసుగా ప్రవర్తించి ఆయనపై చేయి చేసుకున్నట్లు బాధితుడు డి ఎస్ పి కి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కదిరి బార్ అసోసియేషన్ సభ్యులు ద్విచక్ర వాహనాలపై డీఎస్పీ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లారు. న్యాయవాదులను చెబుతున్న పట్టించుకోకుండా ఎస్సై చత్రేనాయక్ ను దూషించి ఆయన వద్ద ఉన్న నగదు, బంగారు గొలుసును తీసుకున్నారని న్యాయవాదులు డి ఎస్ పి కి ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా స్టేషన్ కు పిలిపించి ఖాళీ తెల్లకాగితంపై సంతకం చేయించుకున్నారు అని న్యాయవాదులు తెలిపారు. స్పందించిన డి.ఎస్.పి. లాల్ అహమ్మద్ ఘటనపై విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.