అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో రామాంజనేయులు, నాగరాజు అనే రైతులు బోర్లలో పుష్కలంగా నీరు ఉందని మూడు ఎకరాల్లో అరటి పంట సాగు చేశారు. పుష్కరంగా వర్షాలు కురిశాయి భూగర్భ జలాలకు ఎలాంటి లోటు లేదనుకున్నారు. అయితే ఇటీవల ఎండల తీవ్రత పెరగడం భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. అయినప్పటికీ భూమాతను నమ్ముకున్న రైతన్నలు లక్షలాది రూపాయలు వెచ్చించి మరో ఐదు బోర్లు కూడా వేయించారు. వీటిలో కూడా నీరు పడకపోవడంతో చేసేది లేక మూడు ఎకరాల పంట తీసేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి...