విద్యుత్ తీగలు పడి రైతు మృతి చెందిన విషాదకర ఘటన అనంతపురం జిల్లా దుగుమర్రి గ్రామంలో చోటుచేసుకుంది
. గ్రామానికి చెందిన తలారి పెద్ద బయన్న అనే రైతు పొలం పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు మోటార్ ఆన్ చేయడానికి విద్యుత్ తీగలను మెయిన్ లైనుకు తగిలించే క్రమంలో ప్రమాదవశాత్తు తీగలు మీదలు పడిపోయాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఇదీచదవండి
దారుణం.. భర్తను రోకలితో కొట్టి చంపిన భార్య