ETV Bharat / state

'స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి'

author img

By

Published : Mar 6, 2020, 6:42 PM IST

స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురం జిల్లా వైకాపా కార్యకర్తలకు సూచించారు. జిల్లాలో నిర్వహించిన పార్టీ సమీక్షా సమావేశానికి హాజరైన ఆయన ఈ మేరకు కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ వైకాపా కార్యకర్తలకు సూచించారు. పార్టీ సమీక్షా సమావేశానికి జిల్లా ఇంఛార్జ్ హోదాలో హాజరైన ఆయన కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. తొమ్మిది నెలల పాలనలో ప్రజాసంక్షేమం కోసం జగన్ అవిశ్రాంతంగా పాటుపడుతున్నారని, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యాఖ్యానించారు. స్థానిక సమరంలో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల జోనల్ ఇంఛార్జ్ రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ వైకాపా కార్యకర్తలకు సూచించారు. పార్టీ సమీక్షా సమావేశానికి జిల్లా ఇంఛార్జ్ హోదాలో హాజరైన ఆయన కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. తొమ్మిది నెలల పాలనలో ప్రజాసంక్షేమం కోసం జగన్ అవిశ్రాంతంగా పాటుపడుతున్నారని, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యాఖ్యానించారు. స్థానిక సమరంలో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల జోనల్ ఇంఛార్జ్ రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఇదీచదవండి

'బీసీల కోటాను తగ్గించడం చరిత్రాత్మక తప్పిదం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.