స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ వైకాపా కార్యకర్తలకు సూచించారు. పార్టీ సమీక్షా సమావేశానికి జిల్లా ఇంఛార్జ్ హోదాలో హాజరైన ఆయన కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. తొమ్మిది నెలల పాలనలో ప్రజాసంక్షేమం కోసం జగన్ అవిశ్రాంతంగా పాటుపడుతున్నారని, ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యాఖ్యానించారు. స్థానిక సమరంలో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల జోనల్ ఇంఛార్జ్ రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఇదీచదవండి