లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు అన్నారు. కదిరి మండలం కుమ్మరవాండ్ల పల్లి వద్ద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ఆర్సీపీ నాయకులు పరిశీలించి, కూలీలతో మాట్లాడారు. వర్షాభావం వల్ల భూమి గట్టిగా ఉన్నందున వేతనాలు గిట్టుబాటు కాలేదన్నారు. రోజుకు రూ.350 వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో పనిదినాలు 100 రోజులకు పరిమితం చేయకుండా పనిదినాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు.
'ఉపాధి హామీ పథకం వేతనాలు గిట్టుబాటుగా లేవు'
ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పలనుకు రోజుకు రూ.350 వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు కోరారు. లాక్డౌన్ పరిస్థితుల కారణంగా పనిదినాలు పెంచి కూలీలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు అన్నారు. కదిరి మండలం కుమ్మరవాండ్ల పల్లి వద్ద జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను ఆర్సీపీ నాయకులు పరిశీలించి, కూలీలతో మాట్లాడారు. వర్షాభావం వల్ల భూమి గట్టిగా ఉన్నందున వేతనాలు గిట్టుబాటు కాలేదన్నారు. రోజుకు రూ.350 వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో పనిదినాలు 100 రోజులకు పరిమితం చేయకుండా పనిదినాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు.