అనంతపురం జిల్లా కటారుపల్లి పరిసరాల్లో వర్షపు నీటిని నిల్వ ఉంచుకునేలా వాగులపై చెక్డ్యామ్స్ నిర్మించారు. వీటివల్ల పరిసర ప్రాంతాల్లోని బోరు బావుల్లో నీటి మట్టం పెరిగిందని స్థానికులు చెప్పారు. వేసవిలో అటవీ ప్రాంతంలోని మూగజీవాల దాహార్తిని సైతం తీరుస్తున్నాయన్నారు. కానీ..కొందరు వ్యక్తులు తమ గ్రామంలోని చెరువులు నింపుకునేందుకు చెక్ డ్యాములను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ విషయమై కటారుపల్లి వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: