ETV Bharat / state

'కార్పోరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే ఆ బిల్లులు'

author img

By

Published : Sep 30, 2020, 3:04 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... అనంతపురంలో 3 రోజులుగా వామపక్ష నేతలు చేస్తున్న దీక్షలకు సీపీఐ నేత నారాయణ మద్దతు తెలిపారు. ప్రధాని మోదీ ఏం చేసినా... సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్​కల్యాణ్ మద్దతు ఇస్తున్నారని ఆగ్రహించారు.

CPI Narayana criticize Modi Over New Agriculture Bills
నారాయణ

కార్పోరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని... తోడుగా రాష్ట్రంలో ఉన్న జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్​ మద్దతిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ... అనంతపురంలో 3 రోజులుగా వామపక్షాలు చేస్తున్న దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు.

అదానీ, రిలయన్స్​, మరి కొన్ని వ్యాపార వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటి బిల్లులను తీసుకొచ్చారని నారాయణ ఆరోపించారు. ఈ చర్యకు సీఎం జగన్ మద్దతు ఇవ్వడం ఏంటన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్​లు సైతం మోదీ ఏం చేసినా మద్దతు పలుకుతున్నారని ఆగ్రహించారు. ప్రజలే వీరిని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.

కార్పోరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని... తోడుగా రాష్ట్రంలో ఉన్న జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్​ మద్దతిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ... అనంతపురంలో 3 రోజులుగా వామపక్షాలు చేస్తున్న దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు.

అదానీ, రిలయన్స్​, మరి కొన్ని వ్యాపార వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటి బిల్లులను తీసుకొచ్చారని నారాయణ ఆరోపించారు. ఈ చర్యకు సీఎం జగన్ మద్దతు ఇవ్వడం ఏంటన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కల్యాణ్​లు సైతం మోదీ ఏం చేసినా మద్దతు పలుకుతున్నారని ఆగ్రహించారు. ప్రజలే వీరిని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చదవండి:

భావితరాలు ఈ అప్పులను తీర్చలేవు: యనమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.