ETV Bharat / state

'పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి'

author img

By

Published : Nov 25, 2020, 8:51 PM IST

అనంతపురంలో సీపీఐ నేతలు నిరసన చేపట్టారు. ఏడాదిన్నర కిందట వైకాపా ఇచ్చిన ఇళ్ల స్థలాలు మంజూరు హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

cpi leaders protest
సీపీఐ నాయకుల నిరసన

పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ఏడాదిన్నర కిందట ఇచ్చిన హామీని వైకాపా ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అనంతపురం జిల్లా సింగనమల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు భూమి ఇస్తే ఒక్కో కుటుంబానికి ఏ విధంగా సరిపోతుందని మండల కార్యదర్శి చిన్నప్ప ప్రశ్నించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ విశ్వనాథ్​కు వినతి పత్రం అందజేశారు.

పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ఏడాదిన్నర కిందట ఇచ్చిన హామీని వైకాపా ప్రభుత్వం నిలబెట్టుకోవాలని అనంతపురం జిల్లా సింగనమల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు భూమి ఇస్తే ఒక్కో కుటుంబానికి ఏ విధంగా సరిపోతుందని మండల కార్యదర్శి చిన్నప్ప ప్రశ్నించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ విశ్వనాథ్​కు వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

ఆడపిల్లలు పుట్టడం.. ఆ ఇల్లాలికి శాపమైంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.