ETV Bharat / state

అనంతలో అలజడి.. ఒక్కరోజే 311 కరోనా కేసులు

author img

By

Published : Jul 12, 2020, 6:03 AM IST

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మార్చి 29న మొదలైన వైరస్ అలజడి శనివారం నాటికి జిల్లా నలుమూలలా వ్యాపించింది. జిల్లాలో నిన్న ఒక్కరోజే రాష్ట్రంలోనే అత్యధికంగా 311 మంది వైరస్‌బారిన పడటం ఆందోళన పెంచుతోంది. రోగులకు వైద్యం అందిస్తున్న ఆసుపత్రుల్లో పడకల కొరత మరింత ఇబ్బందికరంగా మారింది.

అనంతలో అలజడి.. ఒక్కరోజే 311 కరోనా కేసులు
అనంతలో అలజడి.. ఒక్కరోజే 311 కరోనా కేసులు
అనంతలో అలజడి.. ఒక్కరోజే 311 కరోనా కేసులు

అనంతపురం జిల్లాలో ఒక్కరోజులో 311 మందికి వైరస్ నిర్ధరణ కావడం హడలెత్తిస్తోంది. కొత్త కేసుల్లో 161 మంది అనంతపురం పట్టణానికి చెందిన వారు ఉన్నారు. కొత్తగా ధర్మవరంలో 29, కదిరిలో 21, గుత్తిలో 11, హిందూపురంలో 9, సీకేపల్లి, గార్లదిన్నె మండలాల్లో 7 కొత్త కేసులు నిర్ధరణ అయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 3161 మందికి వైరస్ సోకగా.. 23 మంది ప్రాణాలొదిలారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2 ప్రయోగశాలల్లో రోజూ రెండు వేల నమూనాలను పరీక్షిస్తున్నారు.

కంట్రోల్​ రూమ్​కు వందల ఫోన్లు

అధికారులు ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా అనంతపురం జిల్లాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. మార్చి 29న లేపాక్షి మండలంలో పదేళ్ల చిన్నారికి వైరస్ సోకిందని గుర్తించినది మొదలు రోజూ బాధితుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. కొంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధులు, వారి వ్యక్తిగత సిబ్బంది, వందల సంఖ్యలో పోలీసులు, పదిమంది వరకు మీడియా ప్రతినిధులు వైరస్ బారిన పడ్డారు. వైరస్ సోకిన వారు ఇంటివద్దనే ఉండి చికిత్స తీసుకుందామనుకున్నా... ఇరుగు, పొరుగువారితో సమస్యగా మారింది. వైరస్ సోకిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్​కు రోజూ 100కు పైగా ఫోన్లు వస్తున్నాయి. వ్యాధి సోకిందనే బాధ కన్నా పక్క వారి వివక్షతోనే రోగులు ఎక్కువగా మనోవేదనకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

పడకలు లేక నేలపై వైద్యం

జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్యకు తగినంతగా పడకలు అందుబాటులో లేవన్నది వాస్తవం. కొత్త రోగుల కోసం పాత రోగులను వారం, పది రోజులకే ఇంటికి పంపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు 150 పడకలు ఏర్పాటు చేయగా...అదనంగా 30 నేల పడకలు వేసి వైద్యం అందిస్తున్నారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో 300 పడకలు ఉండగా...కొత్తగా వచ్చిన వారని నేలపై పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం 1317 మంది రోగులు మూడు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అనంతపురం జిల్లాలో పరీక్షల సంఖ్య పెరుగుతున్న నిష్పత్తిలోనే వైరస్ బాధితుల సంఖ్య వెలుగుచూస్తోంది. ఈ నెల 15 తర్వాత రోజువారీ రోగుల సంఖ్య 500 వరకు వెళ్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు అధికారులను హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి : విశాఖలో మరో కిడ్నాప్ యత్నం... పోలీసులకు చిక్కిన నిందితులు

అనంతలో అలజడి.. ఒక్కరోజే 311 కరోనా కేసులు

అనంతపురం జిల్లాలో ఒక్కరోజులో 311 మందికి వైరస్ నిర్ధరణ కావడం హడలెత్తిస్తోంది. కొత్త కేసుల్లో 161 మంది అనంతపురం పట్టణానికి చెందిన వారు ఉన్నారు. కొత్తగా ధర్మవరంలో 29, కదిరిలో 21, గుత్తిలో 11, హిందూపురంలో 9, సీకేపల్లి, గార్లదిన్నె మండలాల్లో 7 కొత్త కేసులు నిర్ధరణ అయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 3161 మందికి వైరస్ సోకగా.. 23 మంది ప్రాణాలొదిలారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2 ప్రయోగశాలల్లో రోజూ రెండు వేల నమూనాలను పరీక్షిస్తున్నారు.

కంట్రోల్​ రూమ్​కు వందల ఫోన్లు

అధికారులు ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా అనంతపురం జిల్లాలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. మార్చి 29న లేపాక్షి మండలంలో పదేళ్ల చిన్నారికి వైరస్ సోకిందని గుర్తించినది మొదలు రోజూ బాధితుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. కొంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధులు, వారి వ్యక్తిగత సిబ్బంది, వందల సంఖ్యలో పోలీసులు, పదిమంది వరకు మీడియా ప్రతినిధులు వైరస్ బారిన పడ్డారు. వైరస్ సోకిన వారు ఇంటివద్దనే ఉండి చికిత్స తీసుకుందామనుకున్నా... ఇరుగు, పొరుగువారితో సమస్యగా మారింది. వైరస్ సోకిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్​కు రోజూ 100కు పైగా ఫోన్లు వస్తున్నాయి. వ్యాధి సోకిందనే బాధ కన్నా పక్క వారి వివక్షతోనే రోగులు ఎక్కువగా మనోవేదనకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

పడకలు లేక నేలపై వైద్యం

జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్యకు తగినంతగా పడకలు అందుబాటులో లేవన్నది వాస్తవం. కొత్త రోగుల కోసం పాత రోగులను వారం, పది రోజులకే ఇంటికి పంపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు 150 పడకలు ఏర్పాటు చేయగా...అదనంగా 30 నేల పడకలు వేసి వైద్యం అందిస్తున్నారు. బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో 300 పడకలు ఉండగా...కొత్తగా వచ్చిన వారని నేలపై పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం 1317 మంది రోగులు మూడు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అనంతపురం జిల్లాలో పరీక్షల సంఖ్య పెరుగుతున్న నిష్పత్తిలోనే వైరస్ బాధితుల సంఖ్య వెలుగుచూస్తోంది. ఈ నెల 15 తర్వాత రోజువారీ రోగుల సంఖ్య 500 వరకు వెళ్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు అధికారులను హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి : విశాఖలో మరో కిడ్నాప్ యత్నం... పోలీసులకు చిక్కిన నిందితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.