ETV Bharat / state

'ప్రధానికి కోపం వస్తే జగన్​కు బేడీలు ఖాయం' - జగన్ పై కాలవ శ్రీనివాసులు మండిపాటు

అనంతపురం జిల్లా రాయదుర్గం పురపాలక కార్యాలయం ఎదుట తెదేపా కార్యకర్తలు ధర్నా చేశారు. అర్హుల పింఛన్లు తొలగించారని ఆగ్రహించారు.

మాజీ మంత్రి కాలవశ్రీనివాసులు
మాజీ మంత్రి కాలవశ్రీనివాసులు
author img

By

Published : Feb 10, 2020, 10:17 PM IST

మాజీ మంత్రి కాలవశ్రీనివాసులు

అర్హులైన లబ్ధిదారుల పెన్షన్లను తొలగించారని ఆరోపిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం పురపాలక కార్యాలయం ఎదుట తెదేపా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. పరిపాలనలో చంద్రబాబు దార్శనికుడు అయితే... ఆర్థిక నేరాల్లో ముఖ్యమంత్రి జగన్ అగ్రగణ్యుడని విమర్శించారు. పేదల పొట్టలు కొట్టడానికి జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో కొనసాగే పరిస్థితి లేదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీకి కోపం వస్తే.. జగన్​కు బేడీలు ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా విజయం సాధించటం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అర్హులైన లబ్ధిదారుల పెన్షన్లు, రేషన్ కార్డులు పునరుద్ధరించే వరకు ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి కాలవశ్రీనివాసులు

అర్హులైన లబ్ధిదారుల పెన్షన్లను తొలగించారని ఆరోపిస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం పురపాలక కార్యాలయం ఎదుట తెదేపా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. పరిపాలనలో చంద్రబాబు దార్శనికుడు అయితే... ఆర్థిక నేరాల్లో ముఖ్యమంత్రి జగన్ అగ్రగణ్యుడని విమర్శించారు. పేదల పొట్టలు కొట్టడానికి జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో కొనసాగే పరిస్థితి లేదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీకి కోపం వస్తే.. జగన్​కు బేడీలు ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా విజయం సాధించటం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అర్హులైన లబ్ధిదారుల పెన్షన్లు, రేషన్ కార్డులు పునరుద్ధరించే వరకు ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వం ప్రతి అడుగూ చట్ట విరుద్ధమే: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.