ETV Bharat / state

హాథ్రాస్​ ఘటన: గుంటూరు, అనంతపురం జిల్లాలో కొవ్వొత్తుల నిరసన - candle rally about hatras in bommanahal

హాథ్రాస్​ ఘటనపై గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని ప్రజలు నిరసనలు తెలిపారు. ఆ ఘటనను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

candle rally in ananthapur and guntur districts
గుంటూరు, బొమ్మనహాల్​లో హాథ్రాస్​ ఘటనపై కొవ్వొత్తుల ర్యాలీ
author img

By

Published : Oct 6, 2020, 8:46 AM IST

గుంటూరులో..

యూపీలో ఎస్సీ మహిళపై జరిగిన ఘటనను నిరసిస్తూ గుంటూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. బీ. ఆర్​. స్టేడియం నుంచి పాత గుంటూరు పోలీస్​ స్టేషన్​ కూడలి వరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. . నిర్భయ ఘటనలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. యూపీలో ఎస్సీ యువతిపైన ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన మహిళ చివరి చూపు కూడా వారి కుటుంబ సభ్యులకు లేకుండా చేశారని ఆవేదన చెందారు. కేసును తప్పుదారి పట్టించేలా యూపీ పోలీస్​ వ్యవస్థ వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.

అనంతపురం జిల్లాలో..

రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్​లో హాథ్రాస్​ అత్యాచార ఘటనను నిరసిస్తూ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. హాథ్రాస్​లో అత్యాచారం జరిగిన మహిళ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అత్యాచారం చేసిన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :

హాథ్రాస్​ ఘటనపై విద్యార్థి ఐకాస ఆందోళన

గుంటూరులో..

యూపీలో ఎస్సీ మహిళపై జరిగిన ఘటనను నిరసిస్తూ గుంటూరులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. బీ. ఆర్​. స్టేడియం నుంచి పాత గుంటూరు పోలీస్​ స్టేషన్​ కూడలి వరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. . నిర్భయ ఘటనలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. యూపీలో ఎస్సీ యువతిపైన ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన మహిళ చివరి చూపు కూడా వారి కుటుంబ సభ్యులకు లేకుండా చేశారని ఆవేదన చెందారు. కేసును తప్పుదారి పట్టించేలా యూపీ పోలీస్​ వ్యవస్థ వ్యవహరించిందని ఆయన ఆరోపించారు.

అనంతపురం జిల్లాలో..

రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్​లో హాథ్రాస్​ అత్యాచార ఘటనను నిరసిస్తూ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. హాథ్రాస్​లో అత్యాచారం జరిగిన మహిళ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అత్యాచారం చేసిన నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి :

హాథ్రాస్​ ఘటనపై విద్యార్థి ఐకాస ఆందోళన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.