ETV Bharat / state

కదిరిలో 500 మందికి మోదీ కిట్లు పంపిణీ

author img

By

Published : Apr 4, 2020, 4:15 PM IST

లాక్​డౌన్​తో కష్టాలు పడుతున్న కుటుంబాలకు రాష్ట్ర భాజపా నాయకులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కదిరి పట్టణంలోని సుమారు 500 మందికి పైగా వీటిని అందజేశారు.

bjp leaders distributed essential commodities to poor in kadiri
bjp leaders distributed essential commodities to poor in kadiri

మోదీ కిట్ పేరుతో అనంతపురం జిల్లా కదిరిలో భారతీయ జనతా పార్టీ నాయకులు దేవానంద్, వజ్ర భాస్కర్ రెడ్డి పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. లాక్​డౌన్​తో ఆటో డ్రైవర్లు, సంచార జాతులకు కుటుంబ పోషణ భారంగా మారిందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంతో పాటు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు ప్రజలకు అండగా నిలవడం అభినందనీయమని అన్నారు. పట్టణ శివారులోని వందమంది సంచార వాసులకు, కదిరిలో 500 మంది ఆటో కార్మికులకు నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు.

మోదీ కిట్ పేరుతో అనంతపురం జిల్లా కదిరిలో భారతీయ జనతా పార్టీ నాయకులు దేవానంద్, వజ్ర భాస్కర్ రెడ్డి పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. లాక్​డౌన్​తో ఆటో డ్రైవర్లు, సంచార జాతులకు కుటుంబ పోషణ భారంగా మారిందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వంతో పాటు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు ప్రజలకు అండగా నిలవడం అభినందనీయమని అన్నారు. పట్టణ శివారులోని వందమంది సంచార వాసులకు, కదిరిలో 500 మంది ఆటో కార్మికులకు నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు.


ఇదీ చదవండి: లాక్​డౌన్​ ఉన్నా చర్చిలో సమావేశం... 49మంది పాస్టర్లు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.