ఇద్దరు యువకులు అతిగా మద్యం సేవించి ద్విచక్రవాహనంపై వేగంగా నడిమివంక వైపు బయలుదేరారు. పీటీసీ ఓవర్ బ్రిడ్జి వద్ద వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీ కొ'ట్టారు. అనంతపురంలో జరిగిన ఈ సంఘటనలో యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వాహన చోదకులు వారిని 108వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ఉన్నందున వారి వివరాలు తెలియలేదు. ఈ ప్రమాదం వలన సుమారు గంటపాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి:మద్యం మత్తులో వాహనాలు నడిపితే... ప్రాణాలు చిత్తే !