ETV Bharat / state

పోలీసులకు సమాచారం ఇచ్చారని.. భార్యాభర్తలపై దాడి

ఇళ్ల మధ్యే మట్కా నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కొందరు దాడికి దిగారు. బాధితుడి భార్యను సైతం గాయపరిచారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది.

author img

By

Published : May 26, 2020, 9:23 AM IST

assault on husband and wife in kadiri
భార్యాభర్తలపై మట్కా నిర్వాహకుల దాడి

అనంతపురం జిల్లా కదిరి పట్టణం ఖాజానగర్​కు చెందిన షంషుద్దీన్, అతడి భార్యపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ఇళ్ల మధ్యే మట్కా నిర్వహిస్తున్నారని షంషుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఖాజానగర్​కు చెందిన ఇమ్రాన్, రసూల్​తో పాటు మరో 8 మంది వ్యక్తులు తనపై కర్రలు, కత్తులతో దాడి చేశారని బాధితుడు ఆరోపించారు.

తను కేకలు వేయటంతో వారందరూ పారిపోయారని వివరించారు. తన భార్యపైనా దాడి చేయగా.. ఆమె చేయి విరిగిందని వాపోయారు. మట్కా నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకొని, తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

అనంతపురం జిల్లా కదిరి పట్టణం ఖాజానగర్​కు చెందిన షంషుద్దీన్, అతడి భార్యపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ఇళ్ల మధ్యే మట్కా నిర్వహిస్తున్నారని షంషుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఖాజానగర్​కు చెందిన ఇమ్రాన్, రసూల్​తో పాటు మరో 8 మంది వ్యక్తులు తనపై కర్రలు, కత్తులతో దాడి చేశారని బాధితుడు ఆరోపించారు.

తను కేకలు వేయటంతో వారందరూ పారిపోయారని వివరించారు. తన భార్యపైనా దాడి చేయగా.. ఆమె చేయి విరిగిందని వాపోయారు. మట్కా నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకొని, తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

పోలీసులు బెదిరిస్తున్నారని.. కుటుంబం బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.