అనంతపురం జిల్లా కదిరి పట్టణం ఖాజానగర్కు చెందిన షంషుద్దీన్, అతడి భార్యపై కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ఇళ్ల మధ్యే మట్కా నిర్వహిస్తున్నారని షంషుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఖాజానగర్కు చెందిన ఇమ్రాన్, రసూల్తో పాటు మరో 8 మంది వ్యక్తులు తనపై కర్రలు, కత్తులతో దాడి చేశారని బాధితుడు ఆరోపించారు.
తను కేకలు వేయటంతో వారందరూ పారిపోయారని వివరించారు. తన భార్యపైనా దాడి చేయగా.. ఆమె చేయి విరిగిందని వాపోయారు. మట్కా నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకొని, తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: