ETV Bharat / state

ఎన్నికల వేళ.. ధర్మవరం డీఎస్పీ రాయితీల ప్రకటనపై విమర్శలు

author img

By

Published : Mar 7, 2021, 10:04 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో దిశా యాప్ డౌన్​లోడ్​ చేసుకున్న మహిళలకు.. పట్టుచీరలు, మొబైల్ ఉత్పత్తులపై డీఎస్పీ రమాకాంత్ రాయితీలు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సమయంలో వైకాపా నేతలు, వస్త్ర వ్యాపారులతో సమావేశం నిర్వహించి.. ఈ విధంగా వెల్లడించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

allegations on dharmavaram dsp discount announcement
ధర్మవరం డీఎస్పీ రాయితీల ప్రకటనపై విమర్శలు

దిశా యాప్ డౌన్​లోడ్​ చేసుకున్న మహిళలకు రాయితీ ఇస్తామని అనంతపురం జిల్లా ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ప్రకటించడం వివాదానికి దారి తీసింది. పట్టు చీరలపై 10 నుంచి 20 శాతం, మొబైల్ ఉత్పత్తుల కొనుగోలుపై దుకాణాల్లో 10 శాతం తగ్గిస్తామని చెప్పారు. వస్త్ర వ్యాపారులు, వైకాపా నేతలతో సమావేశం అనంతరం.. ఆయన ఈ విధంగా పేర్కొనడంపై పలువురు విమర్శిస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సమయంలో.. వైకాపా నేతలు, పట్టుచీరల వ్యాపారులతో డీఎస్పీ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ రాయితీ ప్రకటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

దిశా యాప్ డౌన్​లోడ్​ చేసుకున్న మహిళలకు రాయితీ ఇస్తామని అనంతపురం జిల్లా ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ప్రకటించడం వివాదానికి దారి తీసింది. పట్టు చీరలపై 10 నుంచి 20 శాతం, మొబైల్ ఉత్పత్తుల కొనుగోలుపై దుకాణాల్లో 10 శాతం తగ్గిస్తామని చెప్పారు. వస్త్ర వ్యాపారులు, వైకాపా నేతలతో సమావేశం అనంతరం.. ఆయన ఈ విధంగా పేర్కొనడంపై పలువురు విమర్శిస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సమయంలో.. వైకాపా నేతలు, పట్టుచీరల వ్యాపారులతో డీఎస్పీ సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఈ రాయితీ ప్రకటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:

పవన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.