ETV Bharat / sports

ముంబయి గల్లీల్లో స్కై సందడి.. 'సుప్లా' షాట్​ అదరగొట్టాడుగా..

author img

By

Published : Mar 8, 2023, 11:23 AM IST

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ తొలి టెస్టు ఆడిన మిస్టర్​ 360 సూర్య కుమార్​ యాదవ్​ ప్రస్తుతం ముంబయిలో సందడి చేశాడు. గల్లీ క్రికెట్ ఆడి అలరించాడు.

surya kumar plays supla shot in mumbai
surya kumar plays supla shot in mumbai

టీమ్​ ఇండియా స్టార్​ క్రికెటర్​ సూర్యకుమార్​ యాదవ్​ ముంబయి వీధుల్లో సందడి చేశాడు. అక్కడి చిన్నారి అభిమానుల కోరిక మేరకు గల్లీ క్రికెట్​ ఆడిన సూర్యకుమార్​.. సుప్లా షాట్​ కొట్టి అలరించాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అయితే బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో ఆడిన సూర్యకుమార్​ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ సమయంలోనే ఇలా ముంబయి వీధుల్లో కనిపించి సందడి చేశాడు. తన అభిమానులకు ఆనందాన్ని కలిగించాడు.

అక్కడున్న చిన్నారుల కోరిక మేరకు ఇలా బ్యాట్​ పట్టిన స్కై.. ఆ తర్వాత వారితో కాసేపు ముచ్చటించాడు. ఆ వీడియోను ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంచైజీ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేసింది. 'ముంబయిలో గల్లీ క్రికెట్‌ ఆడుతున్న సూర్యా భాయ్‌' అంటూ క్యాఫ్షన్​ను సైతం జోడించింది. దీనికి మిస్టర్‌ 360 సైతం స్పందించాడు. 'నా సోదరుల డిమాండ్‌ మేరకు సుప్లా షాట్‌ ఆడాను' అంటూ రాసుకొచ్చాడు. ఇండియన్​ టీమ్​లోని మేటి ప్లేయర్లలో ఒక్కడైన సూర్యకుమార్ మైదానంలో బాల్​ను ఓ ఆటాడుకుంటాడు. స్టేడియం అన్ని వైపులా షాట్లు కొడుతుంటాడు. అందుకే అభిమానులు అతన్ని మిస్టర్​ 360 అని పిలుచుకుంటారు.​

అంతర్జాతీయ క్రికెట్​తో అరంగేట్రం చేసిన స్కై రెండేళ్లకే సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపికయ్యాడు. 2022లోనే 1000కి పైగా పరుగులు సాధించి అందరిని ఆకర్షించాడు. టీ20 ఫార్మాట్‌లో నంబర్‌ 1 ర్యాంకు సాధించి​.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌తో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, నాగ్‌పూర్‌ వేదికగా జరగిన టెస్టులో సూర్య విఫలమయ్యాడు. 20 బంతులు ఎదుర్కొన్న స్కై కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ బాట పట్టాడు.

అయితే 30 ఏళ్ల వయసులో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా రికార్డుకు ఎక్కాడు సూర్య కుమార్​ యాదవ్​. ఇక రెండో టెస్టుకు అయ్యర్‌ తిరిగివచ్చేయడం వల్ల సూర్య కుమార్​కు కాస్త విశ్రాంతి లభించింది. కొన్ని రోజుల క్రితమే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడిని దర్శించుకుని పూజలు చేశాడు. ఆ తర్వాత కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లి తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నాడు. ఆ తర్వాత మంబయిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఇక అన్నీ ఫార్మాట్లోనూ దుమ్ములేపే స్కై.. ఐపీఎల్​లో మరోసారి విజృంభించాలంటూ అభిమానులు కొండంత ఆశలు పెట్టుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఈ 2023 ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో అతని మెరుపు షాట్లను చూసేందుకు ఫ్యాన్స్​ ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా రానున్న సీజన్లో ముంబయి ఇండియన్స్‌ టీమ్​ తన తొలి మ్యాచ్​ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది.

టీమ్​ ఇండియా స్టార్​ క్రికెటర్​ సూర్యకుమార్​ యాదవ్​ ముంబయి వీధుల్లో సందడి చేశాడు. అక్కడి చిన్నారి అభిమానుల కోరిక మేరకు గల్లీ క్రికెట్​ ఆడిన సూర్యకుమార్​.. సుప్లా షాట్​ కొట్టి అలరించాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అయితే బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో ఆడిన సూర్యకుమార్​ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ సమయంలోనే ఇలా ముంబయి వీధుల్లో కనిపించి సందడి చేశాడు. తన అభిమానులకు ఆనందాన్ని కలిగించాడు.

అక్కడున్న చిన్నారుల కోరిక మేరకు ఇలా బ్యాట్​ పట్టిన స్కై.. ఆ తర్వాత వారితో కాసేపు ముచ్చటించాడు. ఆ వీడియోను ముంబయి ఇండియన్స్‌ ఫ్రాంచైజీ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేసింది. 'ముంబయిలో గల్లీ క్రికెట్‌ ఆడుతున్న సూర్యా భాయ్‌' అంటూ క్యాఫ్షన్​ను సైతం జోడించింది. దీనికి మిస్టర్‌ 360 సైతం స్పందించాడు. 'నా సోదరుల డిమాండ్‌ మేరకు సుప్లా షాట్‌ ఆడాను' అంటూ రాసుకొచ్చాడు. ఇండియన్​ టీమ్​లోని మేటి ప్లేయర్లలో ఒక్కడైన సూర్యకుమార్ మైదానంలో బాల్​ను ఓ ఆటాడుకుంటాడు. స్టేడియం అన్ని వైపులా షాట్లు కొడుతుంటాడు. అందుకే అభిమానులు అతన్ని మిస్టర్​ 360 అని పిలుచుకుంటారు.​

అంతర్జాతీయ క్రికెట్​తో అరంగేట్రం చేసిన స్కై రెండేళ్లకే సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపికయ్యాడు. 2022లోనే 1000కి పైగా పరుగులు సాధించి అందరిని ఆకర్షించాడు. టీ20 ఫార్మాట్‌లో నంబర్‌ 1 ర్యాంకు సాధించి​.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 సిరీస్‌తో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, నాగ్‌పూర్‌ వేదికగా జరగిన టెస్టులో సూర్య విఫలమయ్యాడు. 20 బంతులు ఎదుర్కొన్న స్కై కేవలం 8 పరుగులు మాత్రమే చేసి నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ బాట పట్టాడు.

అయితే 30 ఏళ్ల వయసులో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా రికార్డుకు ఎక్కాడు సూర్య కుమార్​ యాదవ్​. ఇక రెండో టెస్టుకు అయ్యర్‌ తిరిగివచ్చేయడం వల్ల సూర్య కుమార్​కు కాస్త విశ్రాంతి లభించింది. కొన్ని రోజుల క్రితమే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడిని దర్శించుకుని పూజలు చేశాడు. ఆ తర్వాత కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లి తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నాడు. ఆ తర్వాత మంబయిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఇక అన్నీ ఫార్మాట్లోనూ దుమ్ములేపే స్కై.. ఐపీఎల్​లో మరోసారి విజృంభించాలంటూ అభిమానులు కొండంత ఆశలు పెట్టుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఈ 2023 ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో అతని మెరుపు షాట్లను చూసేందుకు ఫ్యాన్స్​ ఆసక్తి కనబరుస్తున్నారు. కాగా రానున్న సీజన్లో ముంబయి ఇండియన్స్‌ టీమ్​ తన తొలి మ్యాచ్​ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.