ETV Bharat / sports

ముంబయి వైఫల్యానికి పూర్తి బాధ్యత నాదే: రోహిత్ శర్మ

author img

By

Published : Apr 16, 2022, 11:04 PM IST

Rohit Sharma: ఐపీఎల్ 15వ సీజన్​లో వరుసగా ఆరో లీగ్​ మ్యాచ్​లోనూ ఓటమిపాలైంది ముంబయి ఇండియన్స్. ఈ నేపథ్యంలోనే వరుస వైఫల్యాలకు పూర్తి బాధ్యత తీసుకున్నాడు సారథి రోహిత్ శర్మ. పొరపాటు ఎక్కడ జరుగుతుందో తెలియడంలేదని అన్నాడు.

Rohit Sharma
రోహిత్ శర్మ

Rohit Sharma: ఐపీఎల్​ 2022లో ముంబయి ఇండియన్స్​ పేలవ ప్రదర్శనకు తనదే పూర్తి బాధ్యత అని చెప్పాడు కెప్టెన్ రోహిత్ శర్మ. శనివారం లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ చేతిలోనూ ఓటమిపాలైన అనంతరం ఈ మేరకు పేర్కొన్నాడు. జట్టును గాడినపెట్టేందుకు ఎక్కడ దిద్దుబాటు చేపట్టాలో తెలియడంలేదని అన్నాడు.

"ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలిస్తే.. సరిచేస్తా. కానీ, అది తెలియడంలేదు. ప్రతి గేమ్​కూ ఒకేలా సన్నద్ధమవుతా. అందులో ఏ మార్పూ లేదు. జట్టును ఏ స్థితిలో నిలపాలనే విషయమై నా మీద పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోవడానికి నాదే పూర్తి బాధ్యత. ఎప్పటిలాగే ఆటను ఆస్వాదిస్తా. భవిష్యత్​పై దృష్టిసారించడం కీలకం. ఇంతటితో ప్రపంచం ఆగిపోలేదు. ఇంతకుముందూ గట్టిగా తిరిగొచ్చాం. ఈసారీ అందుకు ప్రయత్నిస్తాం."

-రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్​ కెప్టెన్

ఈ టోర్నీలో బ్యాట్​తోనూ రాణించలేకపోయాడు రోహిత్. ఆడిన ఆరు మ్యాచ్​ల్లో 114 పరుగులు మాత్రమే చేయగలిగాడు. "ఇప్పటి వరకు ఆరు మ్యాచ్​లు ఓడిపోయాం. సరైన కాంబినేషన్​ ఏమిటని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ అది మేము ఆడే ప్రత్యర్థిపై ఆధారపడి ఉంటుంది. ఓడిపోయినప్పుడు జట్టులో చేసిన మార్పులపై వేలెత్తిచూపుతారు. కానీ, ఎప్పుడైనా మా అత్యుత్తమ 11మందితోనే బరిలోకి దిగుతాం."అని రోహిత్ చెప్పాడు.

ఇదీ చూడండి: టీమ్​ఇండియా కెప్టెన్సీనే భారమా? విఫలమైంది రోహిత్​ శర్మనా?

Rohit Sharma: ఐపీఎల్​ 2022లో ముంబయి ఇండియన్స్​ పేలవ ప్రదర్శనకు తనదే పూర్తి బాధ్యత అని చెప్పాడు కెప్టెన్ రోహిత్ శర్మ. శనివారం లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ చేతిలోనూ ఓటమిపాలైన అనంతరం ఈ మేరకు పేర్కొన్నాడు. జట్టును గాడినపెట్టేందుకు ఎక్కడ దిద్దుబాటు చేపట్టాలో తెలియడంలేదని అన్నాడు.

"ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలిస్తే.. సరిచేస్తా. కానీ, అది తెలియడంలేదు. ప్రతి గేమ్​కూ ఒకేలా సన్నద్ధమవుతా. అందులో ఏ మార్పూ లేదు. జట్టును ఏ స్థితిలో నిలపాలనే విషయమై నా మీద పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోవడానికి నాదే పూర్తి బాధ్యత. ఎప్పటిలాగే ఆటను ఆస్వాదిస్తా. భవిష్యత్​పై దృష్టిసారించడం కీలకం. ఇంతటితో ప్రపంచం ఆగిపోలేదు. ఇంతకుముందూ గట్టిగా తిరిగొచ్చాం. ఈసారీ అందుకు ప్రయత్నిస్తాం."

-రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్​ కెప్టెన్

ఈ టోర్నీలో బ్యాట్​తోనూ రాణించలేకపోయాడు రోహిత్. ఆడిన ఆరు మ్యాచ్​ల్లో 114 పరుగులు మాత్రమే చేయగలిగాడు. "ఇప్పటి వరకు ఆరు మ్యాచ్​లు ఓడిపోయాం. సరైన కాంబినేషన్​ ఏమిటని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ అది మేము ఆడే ప్రత్యర్థిపై ఆధారపడి ఉంటుంది. ఓడిపోయినప్పుడు జట్టులో చేసిన మార్పులపై వేలెత్తిచూపుతారు. కానీ, ఎప్పుడైనా మా అత్యుత్తమ 11మందితోనే బరిలోకి దిగుతాం."అని రోహిత్ చెప్పాడు.

ఇదీ చూడండి: టీమ్​ఇండియా కెప్టెన్సీనే భారమా? విఫలమైంది రోహిత్​ శర్మనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.