ETV Bharat / sports

టీమ్​ఇండియా ప్లేయర్లకు ఏమైంది?.. ఆ రేసులోనూ లేరే​

author img

By

Published : Dec 30, 2021, 5:07 PM IST

Mens ODI player of the year 2021: ఐసీసీ వన్డే ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​-2021 అవార్డుకు నలుగురు ఆటగాళ్లు నామినేట్​ అయ్యారు. అంతకుముందు ప్రకటించిన టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డుకు నామినేట్ అవ్వని టీమ్​ఇండియా ప్లేయర్లూ ఈ రేసులోనూ లేకపోవడం గమనార్హం.

Mens ODI player of the year 2021
ఐసీసీ వన్డే ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​-2021

Mens ODI player of the year 2021: టీమ్​​ఇండియాకు ఈ ఏడాది కలిసి రాలేదనే చెప్పాలి. ఇప్పటికే టెస్ట్​, టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​-2021 అవార్డుకు నామినేట్​ అయిన వారి జాబితాను ప్రకటించిన ఐసీసీ.. ఇప్పుడు వన్డే ప్లేయర్ అఫ్​ ది ఇయర్​ జాబితాను ప్రకటించింది. ఇందులోనూ భారత ఆటగాళ్లకు చోటు దక్కలేదు. అయితే టెస్ట్​ అవార్డు రేసులో మాత్రం అశ్విన్​ ఒక్కడికి స్థానం దక్కింది. 'వన్డే ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్'​ అవార్డు రేసులో షకీబ్​ అల్​ హాసన్​, బాబర్​ అజామ్​, జన్నెమన్​ మలన్​, పాల్​ స్టిర్లింగ్ రేసులో ఉన్నట్లు ఐసీసీ పేర్కొంది.

బంగ్లాదేశ్​ కెప్టెన్​, ఆల్​రౌండర్​ షకీబ్​ అల్​ హసన్​.. ఈ ఏడాది 9వన్డేలు ఆడి 40 సగటుతో 277 పరుగులు చేశాడు. దీంతో పాటే 17 వికెట్లు కూడా తీశాడు. ఏడాది పాటు నిషేధానికి గురైన ఇతడు.. వెస్టిండీస్​తో జరిగిన సిరీస్​తో మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు. ఈ సిరీస్​ను తమ జట్టు 3-0తేడాతో దక్కించుకోవడంలో 6వికెట్లు పడగొట్టి కీలకంగా వ్యవహరించాడు. ఇక జింబాబ్వే జరిగిన సిరీస్​లోనూ 145 రన్స్​ సహా 8 వికెట్లను దక్కించుకున్నాడు.

పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​.. ఈ ఏడాది కేవలం ఆరు వన్డేలు ఆడి 68 సగటుతో 405 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్​ల సిరీస్​లో 228 పరుగులు చేశాడు. దీంతో 2-1తేడాతో సిరీస్​ను సొంతం చేసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్​తో జరిగిన ఓ మ్యాచ్​లోనూ 158 పరుగుల భారీ ఇన్నింగ్స్​ ఆడాడు. కానీ ఆ మ్యాచ్​లో పాక్​ ఓడిపోయింది.

మలన్​, స్టెర్లింగ్​ సెంచరీలు

దక్షిణాఫ్రికా ప్లేయర్​ మలన్​.. ఎనిమిది మ్యాచ్​లు ఆడి 85 సగటుతో 509 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. ఇక ఐర్లాండ్​ సీనియర్​ ఆటగాడు పాల్​ స్టెర్లింగ్​ 14 మ్యాచ్​ల్లో 80 సగటుతో 705 రన్స్​ చేయగా.. అందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.

అంతకుముందు 'టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్-2021'​ అవార్డుకు ఇంగ్లాండ్​ బ్యాట్స్​మన్​ జాస్​ బట్లర్​, శ్రీలంక ఆల్​రౌండర్​ వనిందు హసరంగా, అస్ట్రేలియా ప్లేయర్​ మిచెల్​ మార్ష్​,పాకిస్థాన్​ వికెట్​ కీపర్​ మహ్మద్​ రిజ్వాన్​ను... 'టెస్ట్​ ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్'​ అవార్డుకు భారత టాప్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌, ఇంగ్లాండ్‌ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ ఆల్‌ రౌండర్ కైల్ జేమిసన్, శ్రీలంక టెస్టు జట్టు సారథి దిముత్‌ కరుణరత్నె నామినేట్‌ అయినట్లు ఐసీసీ పేర్కొంది.

ఇదీ చూడండి: 'టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్'​.. టీమ్​ఇండియా ఆటగాళ్లకు దక్కని చోటు

Mens ODI player of the year 2021: టీమ్​​ఇండియాకు ఈ ఏడాది కలిసి రాలేదనే చెప్పాలి. ఇప్పటికే టెస్ట్​, టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​-2021 అవార్డుకు నామినేట్​ అయిన వారి జాబితాను ప్రకటించిన ఐసీసీ.. ఇప్పుడు వన్డే ప్లేయర్ అఫ్​ ది ఇయర్​ జాబితాను ప్రకటించింది. ఇందులోనూ భారత ఆటగాళ్లకు చోటు దక్కలేదు. అయితే టెస్ట్​ అవార్డు రేసులో మాత్రం అశ్విన్​ ఒక్కడికి స్థానం దక్కింది. 'వన్డే ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్'​ అవార్డు రేసులో షకీబ్​ అల్​ హాసన్​, బాబర్​ అజామ్​, జన్నెమన్​ మలన్​, పాల్​ స్టిర్లింగ్ రేసులో ఉన్నట్లు ఐసీసీ పేర్కొంది.

బంగ్లాదేశ్​ కెప్టెన్​, ఆల్​రౌండర్​ షకీబ్​ అల్​ హసన్​.. ఈ ఏడాది 9వన్డేలు ఆడి 40 సగటుతో 277 పరుగులు చేశాడు. దీంతో పాటే 17 వికెట్లు కూడా తీశాడు. ఏడాది పాటు నిషేధానికి గురైన ఇతడు.. వెస్టిండీస్​తో జరిగిన సిరీస్​తో మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు. ఈ సిరీస్​ను తమ జట్టు 3-0తేడాతో దక్కించుకోవడంలో 6వికెట్లు పడగొట్టి కీలకంగా వ్యవహరించాడు. ఇక జింబాబ్వే జరిగిన సిరీస్​లోనూ 145 రన్స్​ సహా 8 వికెట్లను దక్కించుకున్నాడు.

పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​.. ఈ ఏడాది కేవలం ఆరు వన్డేలు ఆడి 68 సగటుతో 405 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్​ల సిరీస్​లో 228 పరుగులు చేశాడు. దీంతో 2-1తేడాతో సిరీస్​ను సొంతం చేసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్​తో జరిగిన ఓ మ్యాచ్​లోనూ 158 పరుగుల భారీ ఇన్నింగ్స్​ ఆడాడు. కానీ ఆ మ్యాచ్​లో పాక్​ ఓడిపోయింది.

మలన్​, స్టెర్లింగ్​ సెంచరీలు

దక్షిణాఫ్రికా ప్లేయర్​ మలన్​.. ఎనిమిది మ్యాచ్​లు ఆడి 85 సగటుతో 509 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. ఇక ఐర్లాండ్​ సీనియర్​ ఆటగాడు పాల్​ స్టెర్లింగ్​ 14 మ్యాచ్​ల్లో 80 సగటుతో 705 రన్స్​ చేయగా.. అందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.

అంతకుముందు 'టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్-2021'​ అవార్డుకు ఇంగ్లాండ్​ బ్యాట్స్​మన్​ జాస్​ బట్లర్​, శ్రీలంక ఆల్​రౌండర్​ వనిందు హసరంగా, అస్ట్రేలియా ప్లేయర్​ మిచెల్​ మార్ష్​,పాకిస్థాన్​ వికెట్​ కీపర్​ మహ్మద్​ రిజ్వాన్​ను... 'టెస్ట్​ ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్'​ అవార్డుకు భారత టాప్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌, ఇంగ్లాండ్‌ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ ఆల్‌ రౌండర్ కైల్ జేమిసన్, శ్రీలంక టెస్టు జట్టు సారథి దిముత్‌ కరుణరత్నె నామినేట్‌ అయినట్లు ఐసీసీ పేర్కొంది.

ఇదీ చూడండి: 'టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్'​.. టీమ్​ఇండియా ఆటగాళ్లకు దక్కని చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.