ETV Bharat / sports

ధోనీ స్టంపౌట్​పై ఐసీసీ హెచ్చరిక

author img

By

Published : Feb 4, 2019, 7:25 PM IST

కివీస్​ ఆటగాడు క్రీజు దాటాడు. మహీ చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి.మరి ఐసీసీ హెచ్చరిక ఎందుకు జారీ చేసింది.?

'క్రీజు దాటితే ధోనీకి కోపమొస్తుంది'

భారత్​-కివీస్​ మధ్య ఐదో వన్డేలో ధోని ఆటపై సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ మొదలైంది. మహీ అంటే వేగం అంటూ అందరూ పొగుడతుంటారు...ఈ మాజీ కెప్టెన్​ వెల్లింగ్టన్​ మ్యాచ్​లో చేసిన ఓ స్టంపౌట్​ చూస్తే ఆ మాటలు నిజమే అనిపిస్తాయి. అందుకే ఐసీసీ మిస్టర్​ కూల్​పై ట్విట్టర్లో ప్రశంసలు కురిపిస్తూనే...కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసింది.

Well said @ICC pic.twitter.com/fbmi6Th5M8

— Aditya Sharma (@aadi_9110) February 3, 2019 ">

అసలేం జరిగింది:

కివీ బ్యాటింగ్​ ఇన్నింగ్స్​లో 37వ ఓవర్​...బ్యాట్స్​మెన్​ జేమ్స్​ నీషమ్​ 44పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. కేదార్ వేసిన బాల్​​ను స్వీప్​ షాట్​ ఆడబోయాడు ఈ కివీ ఆటగాడు...అది కాస్త మిస్సయ్యింది. కాని ప్యాడ్​లను తాకుతూ ఎడమచేతి వైపుగా కొంచెం ముందుకు వెళ్లింది. భారత ఆటగాళ్లంతా ఎల్బీ అవుట్​ కోసం అప్పీల్​ చేశారు. ఈలోపు నీషమ్​ క్రీజు దాటి పరుగుకోసం యత్నించాడు. వెంటనే బాల్​ అందుకున్న ధోనీ రెప్పపాటులో బంతిని వికెట్లకు విసిరాడు. అది కాస్త కచ్చితంగా తగిలింది. ఇంకేముంది నీషమ్​ గ్రౌండ్​ వదలక తప్పలేదు.

ఆ రనౌటే మ్యాచ్‌ను కీలక మలుపు తిప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. దీన్ని ఉద్దేశిస్తూ.. ఓ క్రీడాభిమాని చేసిన ట్వీట్‌కు ఐసీసీ స్పందిస్తూ.. ‘‘ధోనీ వికెట్ల వెనక ఉన్నప్పుడు మీరు క్రీజును వదలొద్దు’’ అంటూ ట్వీట్‌ చేసింది.

  • న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్‌ జరగనుంది.

భారత్​-కివీస్​ మధ్య ఐదో వన్డేలో ధోని ఆటపై సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ మొదలైంది. మహీ అంటే వేగం అంటూ అందరూ పొగుడతుంటారు...ఈ మాజీ కెప్టెన్​ వెల్లింగ్టన్​ మ్యాచ్​లో చేసిన ఓ స్టంపౌట్​ చూస్తే ఆ మాటలు నిజమే అనిపిస్తాయి. అందుకే ఐసీసీ మిస్టర్​ కూల్​పై ట్విట్టర్లో ప్రశంసలు కురిపిస్తూనే...కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసింది.

అసలేం జరిగింది:

కివీ బ్యాటింగ్​ ఇన్నింగ్స్​లో 37వ ఓవర్​...బ్యాట్స్​మెన్​ జేమ్స్​ నీషమ్​ 44పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. కేదార్ వేసిన బాల్​​ను స్వీప్​ షాట్​ ఆడబోయాడు ఈ కివీ ఆటగాడు...అది కాస్త మిస్సయ్యింది. కాని ప్యాడ్​లను తాకుతూ ఎడమచేతి వైపుగా కొంచెం ముందుకు వెళ్లింది. భారత ఆటగాళ్లంతా ఎల్బీ అవుట్​ కోసం అప్పీల్​ చేశారు. ఈలోపు నీషమ్​ క్రీజు దాటి పరుగుకోసం యత్నించాడు. వెంటనే బాల్​ అందుకున్న ధోనీ రెప్పపాటులో బంతిని వికెట్లకు విసిరాడు. అది కాస్త కచ్చితంగా తగిలింది. ఇంకేముంది నీషమ్​ గ్రౌండ్​ వదలక తప్పలేదు.

ఆ రనౌటే మ్యాచ్‌ను కీలక మలుపు తిప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. దీన్ని ఉద్దేశిస్తూ.. ఓ క్రీడాభిమాని చేసిన ట్వీట్‌కు ఐసీసీ స్పందిస్తూ.. ‘‘ధోనీ వికెట్ల వెనక ఉన్నప్పుడు మీరు క్రీజును వదలొద్దు’’ అంటూ ట్వీట్‌ చేసింది.

  • న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్‌ జరగనుంది.

Wellington (New Zealand), Feb 04 (ANI): After Indian men's cricket team proved to be triumphant against New Zealand, now women's team will take on Kiwis on their home turf. The team geared up ahead of 1st T20 scheduled to be held on February 6 at Westpac Stadium. Indian batswoman Smriti Mandhana recently claimed top spot in cricket rankings. Indian team has already won the One Day series against New Zealand by 2-1.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.