ETV Bharat / sports

జులై 18 నుంచి '3టీ క్రికెట్'.. బరిలోకి డివిలియర్స్​ - solidarity cup news

టీ20, టీ10, ద హండ్రెడ్​ లీగ్​ తర్వాత క్రికెట్​ ప్రపంచంలో మరో కొత్త ఫార్మాట్​ పరిచయం కాబోతోంది. ఇప్పటివరకు ఒక మ్యాచ్​లో రెండు జట్లు పాల్గొనడం ఆనవాయితీ. అయితే ఈసారి ఒకే మ్యాచ్​లో మూడు టీమ్​లు ఆడనున్నాయి. ఒక్కో జట్టులో కేవలం 8 మందికి మాత్రమే స్థానం ఉంటుంది. ఈ మ్యాచ్​లో గెలిచిన జట్టుకు ట్రోఫీని కాకుండా బంగారు, వెండి, కాంస్యం పతకాలను బహుమతిగా అందిస్తారు. ఇవేమి కొత్త రూల్స్​ అనుకుంటున్నారా.. అయితే జులై 18న క్రికెట్​ దక్షిణాఫ్రికా నిర్వహించబోతోన్న '3 టీమ్​ క్రికెట్​' గురించి తెలుసుకోవాల్సిందే...

3 team cricket news
జులై 18 నుంచి 3టీ క్రికెట్​.. బరిలోకి డివిలియర్స్​
author img

By

Published : Jul 14, 2020, 4:19 PM IST

మూడు నెలల కరోనా విరామం తర్వాత దక్షిణాఫ్రికాలో క్రికెట్‌ పునః ప్రారంభం కానుంది. ఈనెల 18 నుంచి జరుగనున్న 3టీ క్రికెట్‌(3 టీమ్​ క్రికెట్​) సిరీస్‌తో జెంటిల్మెన్​ గేమ్​ మళ్లీ మొదలు కానుంది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు తెలిపింది. నెల్సన్‌ మండేలా జయంతి రోజున ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్​ ద్వారా చాలా రోజులుగా అంతర్జాతీయ క్రికెట్​కు దూరంగా ఉన్న ఏబీ డివిలియర్స్​ మళ్లీ బ్యాట్​ పట్టనున్నాడు.

కరోనా బాధితులకే విరాళం...

సాలిడారిటి కప్‌ పేరిట నిర్వహిస్తోన్న 3టీ క్రికెట్‌ సిరీస్‌ ద్వారా లభించిన మొత్తాన్ని కొవిడ్‌-19 బాధిత కుటుంబాలకు అందించనున్నారు. ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన 24 మంది టాప్‌ క్రికెటర్లు ఎనిమిది మంది చొప్పున 3 జట్లుగా పోటీపడనున్నారు. తొలుత ఈ టోర్నీని జూన్‌ 27నే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఏర్పాట్లు పూర్తికాకపోవడం వల్ల జూలై 18కి వాయిదా వేశారు. సెంచూరియన్​లోని సూపర్​స్పోర్ట్​ స్టేడియం ఈ మ్యాచ్​కు వేదిక కానుంది.

సాలిడారిటీ కప్​ కోసం ఈగల్స్, కింగ్​ ఫిషర్స్​, కైట్స్.. ఈ మూడు​ జట్లు పోటీ పడనున్నాయి. ఈగల్స్​ టీమ్​కు కెప్టెన్​గా ఏబీ డివిలియర్స్​, కింగ్​ ఫిషర్స్​ జట్టు కెప్టెన్​గా రబాడా, కైట్స్​ టీమ్​కు సారథిగా ప్రస్తుత దక్షిణాఫ్రికా టీమ్​ కెప్టెన్​ డికాక్​ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ కొత్త ఫార్మాట్​ క్రికెట్​ అభిమానుల్లో నూతనోత్తేజాన్ని తిరిగి తెస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ గ్రేమ్​ స్మిత్​.

'3 టీమ్ క్రికెట్​' ఫార్మాట్​ రూల్స్​:

  • మూడు జట్లు ఒకే మ్యాచ్​లో పోటీ పడనున్నాయి. ఒక్కొక్క టీమ్​లో 8 మంది ఆటగాళ్లు ఉంటారు. మొత్త 36 ఓవర్లుంటాయి.
  • ఒక ఇన్నింగ్స్​లో ఒక జట్టు మాత్రమే బ్యాటింగ్​ చేయాల్సి ఉంది.
  • ఒక్కో టీమ్​ 12 ఓవర్లు బ్యాటింగ్​ చేస్తుంది.
  • తొలుత ఎవరు బ్యాటింగ్​ చేయాలనేది డ్రా ద్వారా నిర్ణయిస్తారు.
  • ఒక్కో జట్టు బ్యాటింగ్​ చేసే 12 ఓవర్లలో.. తొలి 6 ఓవర్లకు ఒక జట్టు, మిగిలిన ఆరు ఓవర్లకు మరో జట్టు ఫీల్డింగ్​ చేస్తుంది.
  • జట్టులో ఉండే 8 మంది ఆటగాళ్లలో 7 మంది ఔట్​ అయితే చివరిగా ఉన్న బ్యాట్స్​మన్​ ఒంటరిగా ఆడవచ్చు. అయితే అతను సరిసంఖ్య పరుగులే చేయాల్సి ఉంటుంది (అంటే 2,4,6 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంటుంది).
  • అత్యధికంగా ఒక్క బౌలర్​ 3 ఓవర్ల వరకు వేయవచ్చు.
  • ఎవరైతే ఎక్కువ పరుగులు చేస్తారో వారే విజేతలుగా నిలుస్తారు. అత్యధిక పరుగులు చేసిన జట్టుకు బంగారాన్ని.. ఆ తర్వాత రెండో అత్యధిక పరుగులు చేసిన టీమ్​కు వెండి.. మిగిలిన చివరి జట్టుకు కాంస్య పతకాలను బహుమతిగా ఇవ్వనున్నారు.

జట్ల వివరాలు:

కింగ్‌ఫిషర్స్ టీమ్​: రబాడా (కెప్టెన్​), డుప్లెసిస్, క్రిస్ మోరిస్, తబ్రేజ్ షంసీ, రీజా హెండ్రిక్స్, జన్నెమాన్ మలన్, హెన్రిచ్ క్లాసన్, గ్లెంటన్ స్టుర్మాన్.

కైట్స్​ టీమ్​: డికాక్ (కెప్టెన్​), డేవిడ్ మిల్లర్, బవుమా, ఎన్రిచ్ నోర్ట్జే, డ్వేన్ ప్రిటోరియస్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, జెజె స్మట్స్, లూథో సిపామ్లా.

ఈగల్స్ జట్టు: ఏబీ డివిలియర్స్ (కెప్టెన్), మర్కరమ్, లుంగిసాని ఎంగిడి, ఆండిలే, ఫెహ్లుక్వాయో, రాస్సీ వాన్ డెర్ డుసెన్, జూనియర్ డాలా, కైల్ వెర్రిన్నే, సిసాండా మగాలా.

ఇదీ చూడండి: ఐపీఎల్​కు ముందే మరో టీ20 లీగ్​.. ఆగస్టు 18 నుంచే

మూడు నెలల కరోనా విరామం తర్వాత దక్షిణాఫ్రికాలో క్రికెట్‌ పునః ప్రారంభం కానుంది. ఈనెల 18 నుంచి జరుగనున్న 3టీ క్రికెట్‌(3 టీమ్​ క్రికెట్​) సిరీస్‌తో జెంటిల్మెన్​ గేమ్​ మళ్లీ మొదలు కానుంది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు తెలిపింది. నెల్సన్‌ మండేలా జయంతి రోజున ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్​ ద్వారా చాలా రోజులుగా అంతర్జాతీయ క్రికెట్​కు దూరంగా ఉన్న ఏబీ డివిలియర్స్​ మళ్లీ బ్యాట్​ పట్టనున్నాడు.

కరోనా బాధితులకే విరాళం...

సాలిడారిటి కప్‌ పేరిట నిర్వహిస్తోన్న 3టీ క్రికెట్‌ సిరీస్‌ ద్వారా లభించిన మొత్తాన్ని కొవిడ్‌-19 బాధిత కుటుంబాలకు అందించనున్నారు. ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన 24 మంది టాప్‌ క్రికెటర్లు ఎనిమిది మంది చొప్పున 3 జట్లుగా పోటీపడనున్నారు. తొలుత ఈ టోర్నీని జూన్‌ 27నే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఏర్పాట్లు పూర్తికాకపోవడం వల్ల జూలై 18కి వాయిదా వేశారు. సెంచూరియన్​లోని సూపర్​స్పోర్ట్​ స్టేడియం ఈ మ్యాచ్​కు వేదిక కానుంది.

సాలిడారిటీ కప్​ కోసం ఈగల్స్, కింగ్​ ఫిషర్స్​, కైట్స్.. ఈ మూడు​ జట్లు పోటీ పడనున్నాయి. ఈగల్స్​ టీమ్​కు కెప్టెన్​గా ఏబీ డివిలియర్స్​, కింగ్​ ఫిషర్స్​ జట్టు కెప్టెన్​గా రబాడా, కైట్స్​ టీమ్​కు సారథిగా ప్రస్తుత దక్షిణాఫ్రికా టీమ్​ కెప్టెన్​ డికాక్​ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ కొత్త ఫార్మాట్​ క్రికెట్​ అభిమానుల్లో నూతనోత్తేజాన్ని తిరిగి తెస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ గ్రేమ్​ స్మిత్​.

'3 టీమ్ క్రికెట్​' ఫార్మాట్​ రూల్స్​:

  • మూడు జట్లు ఒకే మ్యాచ్​లో పోటీ పడనున్నాయి. ఒక్కొక్క టీమ్​లో 8 మంది ఆటగాళ్లు ఉంటారు. మొత్త 36 ఓవర్లుంటాయి.
  • ఒక ఇన్నింగ్స్​లో ఒక జట్టు మాత్రమే బ్యాటింగ్​ చేయాల్సి ఉంది.
  • ఒక్కో టీమ్​ 12 ఓవర్లు బ్యాటింగ్​ చేస్తుంది.
  • తొలుత ఎవరు బ్యాటింగ్​ చేయాలనేది డ్రా ద్వారా నిర్ణయిస్తారు.
  • ఒక్కో జట్టు బ్యాటింగ్​ చేసే 12 ఓవర్లలో.. తొలి 6 ఓవర్లకు ఒక జట్టు, మిగిలిన ఆరు ఓవర్లకు మరో జట్టు ఫీల్డింగ్​ చేస్తుంది.
  • జట్టులో ఉండే 8 మంది ఆటగాళ్లలో 7 మంది ఔట్​ అయితే చివరిగా ఉన్న బ్యాట్స్​మన్​ ఒంటరిగా ఆడవచ్చు. అయితే అతను సరిసంఖ్య పరుగులే చేయాల్సి ఉంటుంది (అంటే 2,4,6 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంటుంది).
  • అత్యధికంగా ఒక్క బౌలర్​ 3 ఓవర్ల వరకు వేయవచ్చు.
  • ఎవరైతే ఎక్కువ పరుగులు చేస్తారో వారే విజేతలుగా నిలుస్తారు. అత్యధిక పరుగులు చేసిన జట్టుకు బంగారాన్ని.. ఆ తర్వాత రెండో అత్యధిక పరుగులు చేసిన టీమ్​కు వెండి.. మిగిలిన చివరి జట్టుకు కాంస్య పతకాలను బహుమతిగా ఇవ్వనున్నారు.

జట్ల వివరాలు:

కింగ్‌ఫిషర్స్ టీమ్​: రబాడా (కెప్టెన్​), డుప్లెసిస్, క్రిస్ మోరిస్, తబ్రేజ్ షంసీ, రీజా హెండ్రిక్స్, జన్నెమాన్ మలన్, హెన్రిచ్ క్లాసన్, గ్లెంటన్ స్టుర్మాన్.

కైట్స్​ టీమ్​: డికాక్ (కెప్టెన్​), డేవిడ్ మిల్లర్, బవుమా, ఎన్రిచ్ నోర్ట్జే, డ్వేన్ ప్రిటోరియస్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, జెజె స్మట్స్, లూథో సిపామ్లా.

ఈగల్స్ జట్టు: ఏబీ డివిలియర్స్ (కెప్టెన్), మర్కరమ్, లుంగిసాని ఎంగిడి, ఆండిలే, ఫెహ్లుక్వాయో, రాస్సీ వాన్ డెర్ డుసెన్, జూనియర్ డాలా, కైల్ వెర్రిన్నే, సిసాండా మగాలా.

ఇదీ చూడండి: ఐపీఎల్​కు ముందే మరో టీ20 లీగ్​.. ఆగస్టు 18 నుంచే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.