ETV Bharat / sitara

మహేశ్​ సరసన అనన్యా పాండే!

సూపర్​స్టార్​ మహేశ్​బాబు, దర్శకుడు పరశురామ్​ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్​గా కీర్తి సురేశ్​ను ఎంపిక చేయగా.. మరో పాత్ర కోసం బాలీవుడ్​ నటి అనన్యా పాండేను చిత్రబృందం సంప్రదించినట్లు సమాచారం.

author img

By

Published : Aug 5, 2020, 2:38 PM IST

Updated : Aug 5, 2020, 2:56 PM IST

Sarkaru Vaari Paata: Ananya Panday to play second lead in Mahesh Babu's next?
'సర్కారు వారి పాట'లో మహేశ్​ సరసన అనన్య!

బాలీవుడ్​ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన హీరోయిన్​ అనన్యా పాండే. ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమల వైపు అడుగులేస్తోంది. ఇప్పటికే విజయ్​ దేవరకొండ, పూరి జగన్నాథ్​ క్రేజీ కాంబినేషన్​లో ఛాన్స్​ కొట్టేసిన ఈ భామ.. మహేశ్​బాబు కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'లో కథానాయికగా ఎంపికైందని సమాచారం. పరశురామ్​ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కీర్తి సురేశ్​ను ఇప్పటికే ఓ హీరోయిన్​గా ఎంచుకోగా.. మరో హీరోయిన్​ పాత్ర కోసం చిత్రబృందం అనన్యా పాండేను సంప్రదించిందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

Sarkaru Vaari Paata: Ananya Panday to play second lead in Mahesh Babu's next?
అనన్య పాండే

'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్​, 14 రీల్స్​ ఎంటర్​టైన్మెంట్స్​​, జీఎంబీ నిర్మాణ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకింగ్​ రంగంలో జరిగే ఆర్థిక మోసాల కథాంశంతో సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో కీర్తి సురేశ్​ బ్యాంకు ఉద్యోగిగా కనిపించనుంది. తమన్​ స్వరాలు అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్​గా పీఎస్​ వినోద్​, ఎడిటర్​గా మార్తాండ్​.కె వెంకటేశ్​లు పనిచేస్తున్నారు.

బాలీవుడ్​ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించిన హీరోయిన్​ అనన్యా పాండే. ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమల వైపు అడుగులేస్తోంది. ఇప్పటికే విజయ్​ దేవరకొండ, పూరి జగన్నాథ్​ క్రేజీ కాంబినేషన్​లో ఛాన్స్​ కొట్టేసిన ఈ భామ.. మహేశ్​బాబు కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'లో కథానాయికగా ఎంపికైందని సమాచారం. పరశురామ్​ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో కీర్తి సురేశ్​ను ఇప్పటికే ఓ హీరోయిన్​గా ఎంచుకోగా.. మరో హీరోయిన్​ పాత్ర కోసం చిత్రబృందం అనన్యా పాండేను సంప్రదించిందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

Sarkaru Vaari Paata: Ananya Panday to play second lead in Mahesh Babu's next?
అనన్య పాండే

'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్​, 14 రీల్స్​ ఎంటర్​టైన్మెంట్స్​​, జీఎంబీ నిర్మాణ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యాంకింగ్​ రంగంలో జరిగే ఆర్థిక మోసాల కథాంశంతో సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో కీర్తి సురేశ్​ బ్యాంకు ఉద్యోగిగా కనిపించనుంది. తమన్​ స్వరాలు అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్​గా పీఎస్​ వినోద్​, ఎడిటర్​గా మార్తాండ్​.కె వెంకటేశ్​లు పనిచేస్తున్నారు.

Last Updated : Aug 5, 2020, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.