అగ్ర కథానాయకుల్లో చాలా మంది గురి సంక్రాంతిపైనే పడింది. ఇప్పటికే 'సర్కారు వారి పాట', 'రాధేశ్యామ్'తోపాటు పవన్కల్యాణ్ 'భీమ్లా నాయక్'.. ఈ మూడూ ముగ్గుల పండక్కి బెర్తులు ఖాయం చేశాయి. మరికొన్ని రేసులో కనిపిస్తున్నాయి. చివరికి పక్కాగా పండగ బరిలో నిలిచే సినిమాలు ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
![Is the releases of Tollywood movies likely to be delayed again?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12815039_bheemla-nayak.jpg)
![Is the releases of Tollywood movies likely to be delayed again?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12815039_radhe-shyam.jpg)
రెండో దశ కరోనా మొదలు కాకముందు వరకూ 2022 సంక్రాంతి బరిలో రెండు సినిమాలే కనిపించాయి. ఒకటి.. పవన్కల్యాణ్ 'హరి హర వీరమల్లు', మరొకటి 'సర్కారు వారి పాట'. కరోనా తర్వాత కొత్త చిత్రాలు తెరపైకొచ్చాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' స్థానంలో, పవన్కల్యాణ్-రానా మల్టీస్టారర్ చిత్రం జనవరి 12న రానున్నట్లు ప్రకటించారు. మరోవైపు మహేశ్ 'సర్కారు వారి పాట' ముందే చెప్పినట్టు పండగ కోసమే ముస్తాబవుతుండగా, 'రాధేశ్యామ్' అనూహ్యంగా జనవరి 14న అంటూ విడుదల తేదీని ఖాయం చేశారు. దాంతో సంక్రాంతి బరి మరింత రసవత్తరంగా మారింది.
![Is the releases of Tollywood movies likely to be delayed again?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12815039_sarkar-vaari-paata.jpg)
'పుష్ప'రాజ్తో పోటీ..
సంక్రాంతి ఒకేసారి ముగ్గురు అగ్రకథానాయకులు బాక్సాఫీస్ వద్ద పోటీపడడం మంచిది కాదని సినీ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమాల విడుదలలో మార్పు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 'భీమ్లా నాయక్'గా పవన్ కల్యాణ్.. సంక్రాంతి కంటే ముందే వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్రిస్మస్కు ఈ చిత్రం థియేటర్లలోకి రావొచ్చని అంటున్నారు. ఒకవేళ అదే జరిగే పవన్, అల్లు అర్జున్ 'పుష్ప'తో పోటీ పడక తప్పదు.
![Is the releases of Tollywood movies likely to be delayed again?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12815039_rrr.jpg)
పాన్ ఇండియా చిత్రాలూ డౌటే!
మరోవైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అంతంతమాత్రంగా థియేటర్లు తెరచుకోగా.. ఓవర్సీస్తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సినిమాహాళ్లు పూర్తిగా తెరచుకోలేదు. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రాలైన 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' రిలీజ్పై సందేహాలు వస్తున్నాయి. ఒకవేళ అక్టోబరు 13 నాటికి థియేటర్లు పూర్తిగా అందుబాటులోకి రాకపోతే పాన్ ఇండియా చిత్రాల విడుదలలో జాప్యం జరిగే అవకాశం ఉంది.
![Is the releases of Tollywood movies likely to be delayed again?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12815039_acharya.jpg)
![Is the releases of Tollywood movies likely to be delayed again?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12815039_akhanda.jpg)
వాయిదా తప్పదా?
టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలూ దసరా బరిలో ఉండాలని సన్నాహాలు చేస్తున్నాయి. చిరు 'ఆచార్య', బాలయ్య 'అఖండ' సినిమాలూ.. టాలీవుడ్తో పాటు ఓవర్సీస్ మార్కెట్పైనా ఆధారపడ్డాయి. ఒకవేళ ఆ సమయంలో అక్కడ సినిమాహాళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోతే ఈ రెండు చిత్రాలూ వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి!
ఇదీ చూడండి.. '105 మినిట్స్'లో హన్సిక ఏకపాత్రాభినయం