LIVE: జగన్ సొంత ప్రకటనలకయ్యే ఖర్చుతో కార్మికుల వేతనాలు పెంచొచ్చు- టీడీపీ నేత పట్టాభి మీడియా సమావేశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 8, 2024, 1:12 PM IST
|Updated : Jan 8, 2024, 1:37 PM IST
TDP Leader Kommareddy Pattabhi Ram Press Meet Live: జగన్ సర్కార్ ఏపీని ఉద్యమాంధ్రాగా మార్చారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. గత కొన్ని రోజులుగా కార్మికులు ఆందోళనలు చేపడుతుంటే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించటంపై నిరాకరించటంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. పైగా కార్మికులకు వేతనాలు పెంచడానికి డబ్బులు లేవంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. విశాఖలో విలాసవంతమైన సీఎం క్యాంపు కార్యాలయం నిర్మించుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
కార్మికులు చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని ఎలా పోషిస్తారని మండిపడ్డారు. ఈ క్రమంలో సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్యాలస్ల ప్రకటనలకు చేసే దుబారా ఖర్చంత చెయ్యదు ఆందోళన చేస్తున్న వివిధ వర్గాల డిమాండ్ల విలువ అని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్ అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత పట్టాభి రామ్ మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం మీకోసం.