తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యాదాద్రి నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు.. పూర్తి కావొస్తున్నాయి. ప్రధాన ఆలయ నిర్మాణం త్వరలోనే పూర్తికానుందని... ఫిబ్రవరిలో ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రారంభోత్సవంలో చినజీయర్ స్వామి సమక్షంలో 1008 కుండాలతో మహా సుదర్శన యాగం నిర్వహిస్తామని వివరించారు. ప్రపంచ వైష్ణవ పీఠాల నుంచి స్వాములను పిలిపించాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చినజీయర్స్వామి ఆశ్రమంలో తిరునక్షత్ర వేడుకల్లో కుటుంబ సమేతంగా కేసీఆర్ పాల్గొన్నారు. చిన జీయర్ స్వామి ఆశీస్సులు పొందారు. సత్య సంకల్ప గ్రంథాన్ని కేసీఆర్కు బహుకరించారు.
ఇదీ చదవండి: