ETV Bharat / jagte-raho

కలెక్టరేట్ వద్ద తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం

ఎన్ని చట్టాలు వచ్చినా, మార్పులు చేర్పులు జరిగినా రైతులు మాత్రం సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్​లో తమ పొలాన్ని వేరే వ్యక్తులు పట్టా చేయించుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ తల్లీకొడుకు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు.

author img

By

Published : Nov 9, 2020, 10:28 PM IST

కలెక్టరేట్ వద్ద తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం
కలెక్టరేట్ వద్ద తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద తల్లీకొడుకు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఈ విషయం గమనించిన పోలీసులు వారిని అడ్డుకొని సర్దిచెప్పారు. భూవివాదంలో తమకు న్యాయం జరగకపోవడం వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు.

డిచ్​పల్లి మండలం యానాంపల్లి గ్రామంలో సర్వే నంబరు 43/17, 43లో గల 3ఎకరాల 20గుంటల భూమిని స్థానిక జడ్పీటీసీ కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అనుచరులు తమను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ నారాయణరెడ్డి స్పందించి వెంటనే విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద తల్లీకొడుకు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. ఈ విషయం గమనించిన పోలీసులు వారిని అడ్డుకొని సర్దిచెప్పారు. భూవివాదంలో తమకు న్యాయం జరగకపోవడం వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు.

డిచ్​పల్లి మండలం యానాంపల్లి గ్రామంలో సర్వే నంబరు 43/17, 43లో గల 3ఎకరాల 20గుంటల భూమిని స్థానిక జడ్పీటీసీ కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయం అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అనుచరులు తమను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ నారాయణరెడ్డి స్పందించి వెంటనే విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవీచూడండి: ప్రియుడి మోజు..కన్న కొడుకుపై తల్లి హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.