ETV Bharat / jagte-raho

నిర్లక్ష్యం తీసింది చిన్నారి ప్రాణం

author img

By

Published : Feb 12, 2019, 1:56 PM IST

గేటెడ్ కమ్యూనిటీ నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ బాలుడి ప్రాణాలు తీసింది. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ధర్నా చేపట్టారు.

నిర్లక్ష్యం తీసింది చిన్నారి ప్రాణం

నిర్లక్ష్యం తీసింది చిన్నారి ప్రాణం
హైదరాబాద్ నగర శివారు బండ్లగూడలో విషాదం చోటుచేసుకుంది. పీబీఈఎల్ గేటెడ్ కమ్యూనిటీలో పిల్లలు పార్కులో ఆడుకుంటుండగా, విద్యుదాఘాతంతో ఓ ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. పార్కులో మౌనీష్‌ అలంకరణ స్తంభాన్ని పట్టుకున్నాడు. స్తంభానికున్న విద్యుత్ తీగలు తగలి అక్కడికక్కడే మరణించాడు.
undefined
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతుని కుటుంబం చెన్నైకి చెందిన వారు కావడంతో మృతదేహాన్ని ఉదయం స్వస్థలానికి తరలించారు. పార్కు యాజమాన్యం నిర్లక్ష్యంతోనే మౌనీష్ చనిపోయాడని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన నిర్వహించారు.

నిర్లక్ష్యం తీసింది చిన్నారి ప్రాణం
హైదరాబాద్ నగర శివారు బండ్లగూడలో విషాదం చోటుచేసుకుంది. పీబీఈఎల్ గేటెడ్ కమ్యూనిటీలో పిల్లలు పార్కులో ఆడుకుంటుండగా, విద్యుదాఘాతంతో ఓ ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. పార్కులో మౌనీష్‌ అలంకరణ స్తంభాన్ని పట్టుకున్నాడు. స్తంభానికున్న విద్యుత్ తీగలు తగలి అక్కడికక్కడే మరణించాడు.
undefined
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతుని కుటుంబం చెన్నైకి చెందిన వారు కావడంతో మృతదేహాన్ని ఉదయం స్వస్థలానికి తరలించారు. పార్కు యాజమాన్యం నిర్లక్ష్యంతోనే మౌనీష్ చనిపోయాడని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన నిర్వహించారు.
Intro:ఫైల్: JK_TG_KRN_41_12_PATHI RAAKA BANDH_AV_C6
యాంకర్: అంతర్జాతీయ మార్కెట్ తో సంబంధం లేకుండా పత్తిలో తేమ పేరిట కృత్రిమంగా ధరల పతనాన్ని శాసిస్తున్న పెద్దపల్లి వ్యాపారులకు రైతులు గట్టి షాక్ ఇచ్చారు. తేమ ఎక్కువగా ఉందని రైతులే సంచుల్లో బిందెల కొద్దీ నీళ్ళు వస్తున్నారని ఆరోపిస్తున్న వ్యాపారులు కొత్తగా పత్తిలో స్టేబుల్ తక్కువ ఉందని ధరలను తగ్గించేశారు. ఇతర పట్టణాల్లో ధరలు స్థిరంగా ఉన్నా వారం రోజులుగా పెద్దపల్లి మార్కెట్లో మాత్రం ధరల పతనం కొనసాగుతోంది. ఈ క్రమంలో మార్కెట్ కి తీసుకువచ్చే పత్తి పై అనేక ఆంక్షలు పెట్టడంతో ఆగ్రహించిన రైతులు నిన్న ఈరోజు పత్తి మార్కెట్ కు నామమాత్రంగా తీసుకొచ్చారు. ఈ సీజన్లోనే అత్యల్పంగా కేవలం నిన్న 70 క్వింటాళ్ల పత్తి రాగా ఈరోజు మాత్రం కేవలం 50 బస్తాల పత్తి మాత్రమే మార్కెట్ కు వచ్చింది. రైతుల ప్రతిచర్య తో నిర్ఘాంతపోయిన వ్యాపారులు పత్తి కోసం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పత్తి రాక పెద్దమొత్తంలో తగ్గిపోవడంతో నిన్న ఈరోజు మార్కెట్ బోసిపోయింది. ఈ పరిస్థితిపై మార్కెట్ అధికారులు వ్యాపారుల వివరణ కోరగా ఇరువర్గాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.


Body:లక్ష్మణ్


Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.